ఇంగ్లీష్ జట్టుపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మొదటి టెస్టులో జరిగిన పరాభవాన్ని సరిచేసింది. అశ్విన్ మ్యాజిక్ షో ముందు ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. భారీ విక్టరీతో టెస్టు ఛాంపియన్షిప్ లో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది.
సిరీస్ 1-1తో సమం
చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది. టీమిండియా స్పిన్ తో ప్రత్యర్థి జట్టును వణికించింది. టీమ్ఇండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5), రవిచంద్రన్ అశ్విన్ (3) ప్రత్యర్థులను బెంబేలెత్తించారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 286 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 148 బంతుల్లో 106.. అద్వితీయమైన శతకం బాదేశారు. విరాట్ (62; 149 బంతుల్లో 7×4) అతడికి అండగా నిలిచారు. కాగా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన యాష్ రెండో ఇన్నింగ్స్లోనూ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకంగా నిలిచారు. మరోవైపు అక్షర్ పటేల్ 5 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విజయం సాధించారు.
Must Read ;- అశ్విన్ హై క్లాస్ సెంచరీ.. ఇంగ్లాండ్ విలవిల











