ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్రీధర్ రెడ్డి పుట్టిన ఊరు నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో “సోగ్గాడి కాపురం”, వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా “బాలరాజు బంగారు పెళ్ళాం” సినిమాలను నిర్మించారు.
సహృదయులు శ్రీధర్ రెడ్డి లేని లోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.