పోలీసు అంటే.. ఖాకీ దుస్తులు, లాఠీనే కాదు.. మానవత్వం కూడా అని చాటి చెప్తున్నారు. మహేశ్ కుమార్ పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్. పెట్రోలింగ్ లో భాగంగా సోమాజిగూడ పరిసర ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు చిన్నారులు ఆకలితో అలమటించడం చూసి, తన టిఫిన్ బాక్స్ లోని అన్నం వాళ్లకు తినిపించాడు. చిన్నారులకు అన్నం పెట్టే వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు కానిస్టేబుల్ ను అభినందిస్తున్నారు. ఈ విషయం సీపీకి చేరడంతో మహేశ్ కు అవార్డు, రివార్డు కూడా అందించారు.
Must Read ;- పెళ్లిళ్ల పేరుతో లేడీ కానిస్టేబుల్ టోకరా : బడాబాబులను ట్రాప్ చేస్తూ.. డబ్బులు గుంజుతూ!