ఏపీలో కనుమరుగుకానున్న రంగుల ప్రపంచం!
రంగులోకంలో అగతం ఏర్పడింది! కరోనా తెచ్చిన కష్టాలు .. సినీ పరిశ్రమను తీవ్ర నష్టాలను చవిచూసేలా చేశాయి. నష్టాల్లో మనుగడ సాగిస్తున్నామని గగ్గోలు పెడుతుంటే జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ .. టికెట్ల ధరల తగ్గింపు విషయంలో రాజీపడటం లేదు. దీంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యాలు రోడ్డున పడాల్సి వస్తోంది. టిక్కెట్ల ధరల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ నడుస్తుంది. టిక్కెట్ ధరలను నియంత్రించడంతో టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యాలు ముక్త కఠంతో జగన్ రెడ్డి చర్యలను ఖండించారు. ఈక్రమంలో ఒక అడుగు ముందుకు వేసి హీరో నాని కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు తగ్గించి అభిమానులను అవమానించడమేనని, టికెట్ ధర ఎంత అన్నది ఎప్పుడు ప్రేక్షకుడి చూసుకోడని వ్యాఖ్యానించారు. నలుగురికీ ఉపాధి కల్పించే థియేటర్ల కలెక్షన్స్ కన్నా.. పక్కనే కిరాణాకొట్టు పెట్టుకున్నా దానికొచ్చే కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని అసంతృప్తిని వెల్లగక్కాడు. నాని చేసిన వ్యాఖ్యలే ఏపిలో ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు నాని వ్యాఖ్యలను ఖండించి, రివర్స్ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.
నాని వ్యాఖ్యలకు కౌంటర్లు .. మరొవైపు మద్దతులు..!
సినిమా థియేటర్ల యాజమాన్యం టికెట్ ధరలను ఇష్టానుసారం రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నానికి కౌంటర్ ఇస్తూ… వ్యాఖ్యలను ఖండించారు. ప్రేక్షకులకు మేలు చేస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు. మరి ఎంతోకాలంగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న పరిశ్రమ.. కరోనా కష్టాల్లో నష్టాల బాట పడితే ఇంకా ఆదుకోవాల్సింది పోయి .. వారిపై ఇటువంటి కఠిన ఆంక్షాలు పెట్టి, థియేటర్లును సీజ్ చేయడమేమిటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలను గాలికొదిలేసి.. సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విమర్శించారు తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత. నాని చేసిన విమర్శలను అనిత సమర్థించారు. ఇకపై వైసీపీ నేతలు హీరో నాని తల్లి గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.