దేవుడే దేవుడే, మనిషి మనిషే, మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పరోక్షంగా రమణదీక్షితులపై ఫైర్ అయ్యారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రమణదీక్షితుల పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని, ఆరోపణలు ఉన్న వ్యక్తిని మళ్లీ నియమించడం సరికాదని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈవాళ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్షించుకొని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
Must Read ;- స్వామి భక్తిని చాటుకున్న రమణ దీక్షితులు..