ఎందరో నేతలు వస్తున్నారు… వెళుతున్నారు. మా బందరు పోర్టు అతీగతీ పట్టించుకునే నాధుడే లేడు. ఇదిగో అదిగో అంటూనే ఏళు గడిచిపోతున్నాయి. అసలు పోర్టును మేం బతికుండగా చూస్తామా అనిపిస్తోంది. అప్పుడెప్పుడో వై.ఎస్. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి వేసిన శిలాఫలకం శిథిలావస్థకు చేరింది. ఆ తర్వాత ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన పైలాన్ అలాగే ఉంది. మా ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ఎన్నికల్లో ప్రధానంగా పోర్టు గురించే హామీ ఇచ్చారు కొత్త సర్కారు వచ్చి ఏడాది దాటిపోయింది. ఎవరైనా పోర్టు మాట ఎత్తితే ఒట్టు. అసలు అందరికీ సంక్షేమ పథకాలే గుర్తున్నాయికానీ అభివృద్ధి పనుల గురించి అందరూ మరచిపోయారు. మా బందరులో ఆ పారిశ్రామిక వాడ వస్తోంది, ఈ పెట్రో ప్రాజెక్టు వస్తోంది అన్న మాటలే గాని ఏడేళ్లుగా ఏమీ రాలేదు. ఏది వచ్చినా రాకపోయినా మా పోర్టు మాకు వస్తే చాలు…. అభివృద్ధి దానంతట అదే వస్తుంది. అరచేతిలో వైకుంఠం చూపించకుండా త్వరలో పోర్టు పనులు ప్రారంభిస్తే మంచిది.
– అమలేశ్వరరావు, మచిలీపట్నం
తేలిపోతున్న జగన్ ప్రసంగం..!! అసలు ఆ అంశాల ప్రస్తావనేదీ..??
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ...