Letest Updateవైఎస్ఆర్ సీపీ గత ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరిగింది. అలాంటప్పుడు పులివెందుల వ్యవహారాలన్నింటిని జగన్ రెడ్డి సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డికి అప్పగిస్తారని కూడా అన్నారు. రాజకీయంగా గతంలో తెర వెనుక ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి ఆ మధ్య తెర ముందుకు వచ్చారు. ఈయన అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు. అభిషేక్ రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు.
అయితే, జగన్ కడప ఎంపీగా పోటీ చేయనూ లేదు. అభిషేక్ రెడ్డికి పులివెందుల బాధ్యతలు అప్పగించనూ లేదు. ఇప్పటిదాకా ఎలాంటి కీలక పరిణామాలు జరగలేదు. కానీ, ఇప్పుడు అభిషేక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైఎస్ అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్నారు. మామూలుగా అయితే కామన్ అని అనుకోవచ్చు కానీ కుటుంబం అంతా హైదరాబాద్ లో ఉంటే జగన్ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది. జగన్, ఆయన సతీమణి భారతి మాత్రం అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి లేదా కనీసం ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి, పరామర్శించడానికి కూడా వెళ్లలేదని తెలిసింది. ఈ విషయాన్ని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం చెప్పారు.
అభిషేక్ రెడ్డి వయసు 35 ఏళ్లలోపే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఏమయిందో కానీ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఆయన స్వయంగా డాక్టర్ అయినా కూడా ఆయనకు ఉన్న అనారోగ్యం గురించి బయటకు తెలియడం లేదు. అయితే ఆయన కోమాలో ఉన్నారని చెబుతున్నారు. జగన్ కోసం పని చేసిన కుటుంబసభ్యుడ్ని, ఇలా జగన్ పట్టించుకోవడం లేదని.. కానీ ఓ నేరస్తుడ్ని పరామర్శించడానికి మాత్రం జైలుకు వెళ్లారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ కుట్రలు, నేరాలను అమలుచేసే నందిగం సురేష్ను పరామర్శించడానికే బయటకొస్తారా? అంటూ ప్రశ్నించారు. మరి అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. పైగా పది రోజులుగా వరదలో విజయవాడ జనం అల్లాడుతుంటే జస్ట్ బురదలో కాళ్లు పెట్టి.. ఫోటోలు దిగి వెళ్లిపోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.










