ఐదేళ్ల వయసంటే.. కనీసం అ నుండి అః వరకు, A-Z వరకు సరిగా రానుకూడా రాదు. అలాంటి చిన్న వయసులో 100 డెసిమల్ నంబర్ల పై వాల్యూ (దశాంశ సంఖ్యల విలువ)ను కేవలం 18.1 సెకన్లలో టకటకా చెప్పేయడంటే మాటలా! వింటుంటేనే ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు కదూ! కానీ, ఏమాత్రం తడుముకోకుండా చిట్టి చిలకమ్మ.. అంటూ రైమింగ్స్ పాడాల్సిన వయసులో ప్రపంచ రికార్డు సృష్టించిందీ విజయవాడు చెందిన ఐదేళ్ల చిన్నారి అభిజ్ఞ త్రిపురనేని.
విజయవాడకు చెందిన వైద్యులు శరత్ చంద్ర, చాముండేశ్వరి దంపతుల కుమార్తె ఐదేళ్ల చిన్నారి అభిజ్ఞ త్రిపురనేని.. కేవలం 18.1 సెకన్లలో 100 దశాంశ సంఖ్యల విలువను అలవోకగా చెప్పింది. ఇలా టకా టకా చెప్పేసినందుకు, చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోకి సగర్వంగా ఎక్కింది. ‘ఫాస్టెస్ట్ టు రీకాల్ 100 డిజిట్స్ ఆఫ్ పై వేల్యూ బై ఎ కిడ్’ అనే టైటిల్ను సొంతం చేసుకుంది. గతంలోనూ ఇదే ఘనతను 19.4 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసిన అభిజ్ఞ.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ప్రస్తుతం అభిజ్ఞ నెలకొల్పిన 18.1 సెకన్ల రికార్డును ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు’కు క్లెయిమ్ చేయగా.. 2022 సంవత్సరానికి ‘ఫాస్టెస్ట్ టు రీకాల్ 100 డిజిట్స్ ఆఫ్ పై వేల్యూ బై ఎ కిడ్’ అనే టైటిల్ను తమ కుమార్తెకు ఖరారు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధుల నుంచి సమాచారం వచ్చిందని ఆమె తల్లి డాక్టర్ చాముండేశ్వరి తెలిపారు.
Must Read ;- 1500 కిలోమీటర్లు.. 7 రోజులు.. మెరిసిన తెలుగు తేజం..











