అమరావతి మహిళలపై సా*క్షి టీవీ చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ఏం చేయాలో ఆ పార్టీ నేతలకు పాలుపోవడం లేదు. ఈ ఇష్యూతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలకు తోడు సంకర జాతి అంటూ సజ్జల చేసిన కామెంట్స్తో అగ్ని ఆజ్యం పోసినట్లయింది. దీంతో వైసీపీని, ఆ పార్టీ చీఫ్ జగన్పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ డ్యామేజీని కవర్ చేసుకునేందుకు ఇప్పుడు వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపింది.
తాజాగా ఏలూరులోని సా*క్షి ఆఫీసులో మంటలు చెలరేగాయి. ఆఫీసులోని ఫర్నీచర్ పూర్తిగా తగలబడిపోయింది. ఆఫీసు ముందు ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐతే ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇది టీడీపీ నేతలే పనే అంటూ ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఐతే వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. వైసీపీ ఆఫీసులో జరిగిన ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. సానుభూతి కోసం సా*క్షి ఆఫీసుపై వాళ్లే దాడి చేసుకుని పక్కవారిపై నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.
ఇక చేసిన తప్పులు, నేరాలను పక్కవారిపై నెట్టడం వైసీపీకి, జగన్కు వెన్నతో పెట్టిన విద్య. గతంలో అనేక అంశాల్లో ఈ విషయం రుజువైంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సొంత బాబాయిని అత్యంత దారుంగా హత్య చేసి, ఆ నేరాన్ని టీడీపీ నేతలపైకి నెట్టారు వైసీపీ అధినేత జగన్. డ్రామాను ర*క్తి కట్టించారు. తీరా విచారణలో వివేకా హత్య వెనుక జగన్కు అత్యంత సన్నిహిత వ్యక్తులే ఉన్నారని తేలింది. ఇక షర్మిల తన అన్నతో విబేధించి కొత్త కుంపటి పెట్టిన టైంలోనూ జగన్ ఇదే విధానాన్ని అనుసరించారు. షర్మిల వెనుక చంద్రబాబు, టీడీపీ ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ అబద్ధాలేనని తేలిపోయాయి.
ఇక ఇప్పటికీ కూడా వైసీపీ తన తీరు మార్చుకోవడం లేదు. అమరావతి మహిళలను ఉద్దేశించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తోంది. ఈ ఇష్యూపై జగన్ చేస్తున్న ట్వీట్లు, సజ్జలతో పాటు ఆ పార్టీ నేతల కామెంట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ వ్యవహార శైలి ఉంది











