వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఆర్ధిక నేరగాళ్లు, బూతు వీరులు రాజ్యం ఏలుతున్నారా.? ఆయన కోటరీలో, టీమ్లో వీరికే అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందనే చర్చ గత కొన్నేళ్లుగా ఉన్నా, తాజాగా అది మరింతగా బయటపడుతోంది.. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయిన వైసీపీ నేతలని చూడండి.. వారంతా అయితే ఆర్ధిక నేరగాళ్లు, లేదంటే బూతు వీరులు…
మాజీ ఎమ్ఎల్ఏ వల్లభనేని వంశీ.. గన్నవరంలో ఆయన చేయని మాఫియా లేదు.. పీఎస్ఆర్ ఆంజనేయులు…. డీజీ కేడర్లో ఉన్న అధికారి ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతోపాటు ఇక హీరోయిన్ జెత్వానీ కేసులో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. ఇటు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్… తన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో ఆయన గనుల మాఫియాతో వందల కోట్లు వెనకేసుకున్నాడనే ప్రచారం ఉంది.. మరో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. తాడేపల్లి ప్యాలెస్ నుండి 500 కోట్ల రూపాయలను ఎన్నికలకు ఖర్చుకి అందుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ఇక, జైలులో ఉన్న నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్.. బోరుగడ్డ అనిల్… ఏపీలోని ప్రధాన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎ పవన్ కళ్యాణ్పై 2019 నుండి 24 మధ్య చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో చెప్పాల్సిన పనిలేదు.. అయినా, జగన్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఫిర్యాదులు అందినా తొక్కిపెట్టారు.. కేసు నమోదు చేసినా నాడు లైట్ తీసుకున్నారు.. అధికారం మారిందో లేదో, వీరంతా ఊచలు లెక్కపెడుతున్నారు..
తాజాగా సీనియర్ జర్నలిస్ట్, వైసీపీ పేటీమ్ బ్యాచ్గా ముద్రపడిన వీవీఆర్ కృష్ణం రాజు.. జగన్ సొంత చానెల్ సాక్షిలో అమరావతి వేశ్యల రాజధానిగా చిత్రీకరించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని దేవతల రాజధానిగా శ్లాఘిస్తుంటే, ఈ మహానుభావుడు వేశ్యల రాజధానిగా ముద్ర వేయాలని చూడడం, దానిపై ఇచ్చిన వివరణలోనూ ఎక్కడా తప్పు చేశాను అన్న భావన లేకపోవడం విచిత్రం.. అదే, చంద్రబాబు హయాంలో టీడీపీ కార్యకర్త కిరణ్.. భారతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు.. కానీ, జగన్ ఆయన టీమ్.. కృష్ణం రాజు వ్యాఖ్యలపై కించిత్ విచారణ వ్యక్తం చేయలేదు సరికదా.. తమ చానెల్కి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని బురద కడుక్కునే ప్రయత్నం చేసింది..
ఇక, తెనాలిలో పోలీసులు చితకబాదిన ముగ్గురు యువకుల కుటుంబాలని పరామర్శించడానికి జగన్ వచ్చిన సందర్భంలో ఓ యువకుడు, జగన్ అభిమాని, వైసీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి.. అసభ్యకరంగా ఉన్నాయి.. సభ్యసమాజంలో అలాంటి కామెంట్స్ని వినడానికి సైతం అసహ్యించుకుంటారు.. ఇలాంటి వారితో జగన్ రాజకీయాలు చేస్తుండడం ఆయన నైజాన్ని, మనస్తత్వాన్ని బయటపెడుతోందనే విశ్లేషణ సాగుతోంది.. వైసీపీ అధినేతకి ఇలాంటి బూతులంటేనే ఇష్టమని, అలాంటి వారినే ఆయన ఎంకరేజ్ చేస్తాడని గుర్తు చేస్తున్నారు.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్…. ఇలా ఎందరో వైసీపీ నేతలు తప్పు చేసిన మొదట్లోనే, బూతులు ప్రయోగించిన ఆదిలోనే అణచివేసి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదనేది సత్యం.. కానీ, జగన్ వారిని ఎంకరేజ్ చేశారు.. భుజం తట్టి మరీ ప్రోత్సహించారు.. వారికి బహిరంగంగా ముద్దులు పెట్టారు… మంత్రి పదవులు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు ఇచ్చి వారి వెన్నంటి నిలిచారు.. ఇదే నేడు ఏపీ సమాజాన్ని భయపెడుతోంది..
ఈ జగన్ మనస్తత్వం, ఆలోచనలు, భావనలు, ఐడియాలజీనే వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి 11 సీట్లకు పరిమితం చేసింది.. ఇది అర్ఢమై ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్.. తాము తప్పు చేశామని లబోదిబోమన్నారు.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని లెంపలు వేసుకున్నారు.. ఆయన ఈ కామెంట్స్ చేసిన అరక్షణంలోనే పెయిడ్ జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.. అంటే, వైసీపీలో బూతు సంస్కృతి, ఈ విషవృక్షం ఎంత బలీయంగా వేళ్లూనుకుందో వీడియోస్ సాక్షిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. అయినా జగన్ ఈ ముద్ర నుండి తప్పించుకోవాలని, వాటికి దూరంగా ఉండాలనే సంకేతాలను పంపడం లేదు.. దీంతో, అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ మూక వైసీపీలో ఎంటర్ అవుతోందనే భయం.. ఆ పార్టీ కేడర్, యువతలో స్పష్టంగా వెళుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ని షేక్ చేస్తోంది.. అయినా, తాడేపల్లి ప్యాలెస్ ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. అధినేత జగన్లోనే మార్పు రానప్పుడు కేడర్ ఏం చేయగలుగుతుంది..? జగన్ తీరు మారదు.. ఏపీ ప్రజల తీర్పు మార్చారు. ఇదే టీడీపీ, జనసేనకి, ఆ పార్టీల కేడర్కి శ్రీరామరక్ష..











