వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయినట్లుంది. అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్పై జగన్ చేసిన ట్వీట్… ఆ పార్టీ హైకమాండ్ ఆలోచనలు, భావజాలానికి అద్దం పడుతోందనే కామెం్టస్ వినిపిస్తున్నాయి.. సాక్షి చానెల్ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు అలియాస్ కేఎస్ఆర్ నిర్వహించిన డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి.. ఈ ఎపిసోడ్లో తాజాగా కొమ్మినేనిని అరెస్ట్ చేశారు పోలీసులు.. కొమ్మినేని అరెస్ట్పై వైసీపీ అధినేత వివరణ అత్యంత పేలవంగా, దారుణంగా ఉందనే విశ్లేషణ సాగుతోంది.. జగన్కి మరింత డ్యామేజ్ చేసేదిగా ఉందని వైసీపీలోని కొందరు అభిప్రాయపడుతుండడం విశేషం..
జగన్ కామెంట్స్ ఒకసారి చూద్దాం..
“ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా
@ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.
సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.“
కొమ్మినేనిని 70 ఏళ్ల వృద్ధుడు, ఆయనని అరెస్ట్ చేయడం అన్యాయం అని అభిప్రాయ పడ్డారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఒక చిన్న మెస్సేజ్ షేర్ చేసినందుకు 80 ఏళ్ల వృద్ధుడు, సీనియర్ జర్నలిస్ట్ అయిన అంకబాబుని అర్ధరాత్రి అక్రమంగా తీసుకుపోయారు. నాడు ఇది తప్పు అని మీకు అనిపించలేదా అని నిలదీస్తున్నారు.. కేఎస్ఆర్ వయసు, అంకబాబు కంటే పదేళ్లు ఎక్కువ అనే సంగతి గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు..
ఇక, మరో పాయింట్ ఏంటంటే.. డిబేట్తో యాంకర్కి సంబంధం ఏంటి అని క్వశ్చన్ చేశారు జగన్.. కానీ, ఆ షోలో మోడరేటర్గా ఉన్న కొమ్మినేనికి…. కృష్ణం రాజు చేసిన కామెంట్స్ తప్పు అని అర్ధం అయింది.. వాటిపై మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు అన్నారు కానీ, వాటిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.. మరి, ఆయనని యాంకర్ అనాలా?? సాక్షి భావజాలం, సిద్ధాంతాలకు మూలమైన జగన్ ఐడియాలజీని ప్రజలలోకి చొప్పించే సీక్రెట్ ప్లాన్గా భావించాలా..?? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.. మీరు చెప్పినట్లు ఇది వ్యక్తిత్వ హననం కాదా జగన్ గారూ..??? లక్షల మంది అమరావతి మహిళల వ్యక్తిత్వాలను తప్పు పడుతున్నట్లు కాదా….?? ఇది చూసిన వారికి నిజంగా కొమ్మినేని నిష్పక్షపాతంగా డిబేట్లు నిర్వహిస్తున్నారని భావించవచ్చా…??
కొమ్మినేనిని అరెస్ట్ చేయడం చెడు సంప్రదాయాలకు తెరదీయడమే అంటున్నారు జగన్.. నిజంగా ఆయన ఈ మాటని గుండె మీద చెయ్యివేసుకొని చెప్పగలరా.?? విజయసాయి రెడ్డి లాంటి ఆర్ధిక నేరగాడిని సౌమ్యుడు, వివాద రహితుడు, పెద్దమనిషి అని చెప్పి ఓటు వేయమని అడిగినప్పుడే జగన్ని ప్రశ్నించినప్పుడే నిలదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. జగన్ ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేయించలేదు..?? ఎంతమందిపై కేసులు బనాయించలేదు..?. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టినప్పుడు జగన్కి గుర్తుకు రాలేదా?. ఇవి అక్రమ కేసులు అని.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్పై పెట్టిన కేసు అక్రమ కేసు కాదా..?? ఇది తప్పు కాదా..?? ఇలాంటి తప్పులని ప్రారంభించినప్పుడు ఏమయింది జగన్ బుద్ధి..?? నాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొన్న ఆయనకు తెలియదు అనుకోవాలా..??
ఈ విత్తుని నాటింది ఎవరు మాజీ ముఖ్యమంత్రివర్యా..?? గతంలో ఎన్నడూ ఈ సంస్కృతి ఏపీ రాజకీయాలలో లేదు.. బడా నేతలని టార్గెట్ చేయడం, అరెస్ట్ చేయడం మీరు చూపిన దారియే కదా మహాశయా..?? ఇది తమరు నేర్పిన విద్యయే పబ్జీమోహనా.. అని ఎత్తి పొడుస్తున్నారు..
కొమ్మినేని, కృష్ణం రాజు ఘటనతో వైసీపీ గ్రాఫ్, ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.. ఈ నెల 12వ తేదీతో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది.. దీంతో, చంద్రబాబు సర్కార్పై దుమ్మెత్తి పోయాలనుకున్న జగన్కి ఆ పప్పులు ఉడకడం లేదు.. ఇటు, ఆయన ప్లాన్ చేసుకున్న పొగాకు రైతుల పరామర్శ యాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి.. ఇది వైసీపీ అమరావతికి వ్యతిరేకం అనే ముద్రని మరింత బలంగా ప్రజల మధ్యకు తీసుకుపోయింది.. మహిళలపై ఆ పార్టీ మొదటి నుండి దాడి చేస్తోంది.. ఈ ఎపిసోడ్లోనూ మహిళలపై ఎటాక్ కనిపిస్తోంది..
వైసీపీకి బూతు పార్టీ అనే ముద్ర ఉంది.. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు వ్యాఖ్యలు బూతుని తలపిస్తున్నాయి.. ఇది కూడా జగన్కి మైనస్గా మారుతోంది. ఇన్ని అంశాలతో ఒక చిన్న ఇష్యూతో వైసీపీకి తీరని నష్టం జరుగుతుంటే, దానిని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక జగన్ సతమతం అవుతున్నారు.. తలబొప్పి కట్టింది ఆయనకి.. దీంతో, మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మొత్తమ్మీద, జగన్ ఒక విష విలయంలో చిక్కుకున్నారు.. ఆయనని గత ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారో కారణం.. కృష్ణం రాజు, కొమ్మినేని ఎపిసోడ్లోనే ఉంది.. ఆయనని దారుణంగా ఓడించిన అంశాలన్నీ ఈ ఒక్క వీడియోలోనే ఉన్నాయి.. ఈ వీడియోపై ప్రజలలో ఎందుకు ఇంతటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందో తెలిస్తే, ఆయన దానిని డీకోడ్ చేయగలిగితే పార్టీ రిపేర్ అవుతుంది.. లేదంటే మరోసారి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..











