ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రవేశించడంతో ఆమెను ఎదుర్కొనేందుకు సోదరుడు వైఎస్ జగన్ ఇప్పటి నుంచే సమాలోచనలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో లేదా కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి అటు అసెంబ్లీ స్థానానికి గానీ, లోక్ సభ స్థానానికి గానీ షర్మిల పోటీ చేస్తారు. అందుకని జగన్ కు ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. ఇప్పటికే చెల్లెళ్లు షర్మిల, బాబాయి కుమార్తె సునీతను రాచిరంపాన పెట్టారన్న అపవాదు వైఎస్ జగన్ పై ఉంది. అందుకు తగ్గట్లుగానే అధికారంలోకి వచ్చాక అహంకారం పెరిగిపోయిన జగన్ కు గట్టి షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య పులివెందులలో జగన్ కు ప్రత్యర్థిగా సునీతను ఇంటిపెండెంట్ గా లేదంటే టీడీపీ తరపున నిలబెడతారని కూడా వార్తలు వచ్చాయి. కడప ఎంపీగా పోటీ చేయిస్తారని కూడా అంచనాలు వేశారు. ఇలా చెల్లెలితో పోటీ చేయించడం ద్వారా జగన్ ప్రతిష్ఠ మరింత దిగజారుతుందని కూడా షర్మిల, సునీత భావించారు. ఆ అవకాశాలు అసాధ్యం అని చెప్పలేం. అందుకే జగన్ కి కూడా ఆ భయం ఉంది. ఒకవేళ వారిలో ఎవరైనా పోటీ చేసినప్పటికీ అక్కడ తనను లేదా తన మనిషిని గెలిపించుకోవడానికి జగన్ ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, ఇప్పుడు షర్మిల పులివెందుల లేదా మరో స్థానం నుంచి పోటీకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆమె జగన్ కు ప్రత్యర్థిగానే నిలబడితే ఎలా అనే సందేహం కూడా జగన్ లో ఉంది. అందుకే తాను ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికల బరిలో తన భార్య భారతి రెడ్డిని కూడా బరిలో నిలపాలని జగన్ యోచిస్తున్నట్లుగా టాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల దూకుడు చూసిన జగన్.. చెల్లెల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ ప్లాన్లు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలను జగన్ దగ్గరికి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు రాయబారాలు కూడా పంపారని వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాకుండానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిపోయింది. జగన్ కు నచ్చని కాంగ్రెస్ పార్టీలో ఆయన సొంత చెల్లెలు షర్మిల చేరడమే.. రాష్ట్రంలో పరువు తక్కువ విషయం. అలాంటిది వైఎస్ షర్మిల తన సోదరుడిపైనే పోటీకి దిగితే మాత్రం ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.