మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో బాస్ తొక్కేశాడు అనే పేరుతో కొద్దిరోజులుగా సాగుతున్న ట్రోలింగ్కు, టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్కు ముడిపెడుతూ వైసీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. గతంలో ఎప్పుడో విజయ్ మాట్లాడిన పాత వ్యాఖ్యలను తవ్వితీసి, ఈ ట్రోలింగ్ వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ ఫ్యాన్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తోంది. అయితే, ఈ చౌకబారు ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మెగా అభిమానులపై ప్రేమ కానే కాదు..రాజ్యసభలో జగన్ అక్రమాస్తుల కేసుల గుట్టును ఎంపీ చింతకాయల విజయ్ బట్టబయలు చేయడమేనని స్పష్టమవుతోంది.
రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై చింతకాయల విజయ్ నేరుగా విరుచుకుపడుతున్నారు. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్.. సీబీఐ, ఈడీ నమోదు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో జగన్ 13 ఏళ్లుగా విచారణకు సహకరించకుండా డిశ్చార్జ్ పిటిషన్లతో ఏ విధంగా జాప్యం చేస్తున్నారో పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. జాతీయ స్థాయిలో జగన్ డ్రామాలను విజయ్ ఎండగట్టడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయ్ ఎత్తిన ప్రశ్నలకు చట్టపరంగా గానీ, రాజకీయంగా గానీ సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరపైకి తెచ్చింది.
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ చిరంజీవి ట్రోలింగ్ డ్రామాను సృష్టించారు వైసీపీ నేతలు. సినీ రంగానికి సంబంధించిన అంశాన్ని పట్టుకుని, దాన్ని విజయ్కు ఆపాదించడం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు, ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్పై యుద్ధం మొదలుపెట్టారు విజయ్. అవకాశం వచ్చినప్పుడల్లా..జగన్ అసమర్ధతను, విధ్వంస పాలనను జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. దీంతో విజయ్ అంటే జగన్కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే విజయ్ టార్గెట్గా కుట్రలకు తెరలేపింది ఫ్యాన్ పార్టీ.











