ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి సహా మరికొందరికి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం..
వైసిపి వర్గాల గుండెల్లో పరిగెడుతున్న రైళ్ళు !
గొడ్డలి వేటు కేసును గుండె పోటుగా మార్చిన వారి గుట్టు విప్పేందుకు సిబిఐ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. హత్యలో ప్రధాన పాత్రదారులు ఇచ్చిన
సమాచారం ఆధారంగా సూత్రదారుల పని పట్టేందుకు సిబిఐ అధికారులు ఢిల్లీ నుండి పులివెందులకు బయలుదేరినట్లు సమాచారం. మాజీ మంత్రి
వైఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేయడంతో పాటు దానిని గుండె పోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన వారిని విచారించేందుకు సిబిఐ అధికారులు
రంగం సిద్దం చేస్తున్నట్లు హస్తిన వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ కేసులో కీలక సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ
అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి సహా మరికొందరికి సిబిఐ అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనితో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులతో పాటు అధికార వైసిపి వర్గాల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇప్పటికే అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తున్న నేపధ్యంలో సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా, విచారణ చేసినా, అరెస్ట్ చేసినా ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రభుత్వ సలహదారు సజ్జల చెప్పిన కళ్ళ సిద్ధాంతం బెడిసి కొట్టి సర్కార్ కు ఎదురు దెబ్బ కొట్ట నుంది. ఈ నేపధ్యంలో సిబిఐ అధికారుల పులివెందుల రాకపై అటు అధికార వైసిపితో పాటు వైఎస్ కుంటుంబీకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Must Read:-రేషన్ పంపిణీ ఆపరేటర్ లను బురిడీ కొట్టించిన వైసిపి ప్రభుత్వం..











