ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి పనులు చకాచకా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.52 వేల కోట్లతో చేపడుతున్న పనులు, రూ.48 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ప్రధాని మోదీకి వివరించనున్నారు చంద్రబాబు. రాజధాని పనులకు తొమ్మిదేళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున..ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నవ నగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించనున్నట్టు సమాచారం.
ఈ కార్యక్రమం నిర్వహణ కోసం సచివాలయం వెనుక N-9 పక్కనే 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానితోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో రవాణాకు అనుకూలంగా ఉండేలా ఈ స్థలాన్ని ఎంపికచేశారు. వాస్తుపరంగానూ అనుకూలమని నిర్ణయించారు. రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్షించారు.
సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం.? ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చించారు. రాజధానిలో ఏ ప్రాంతాలు సభ నిర్వహణకు అనుకూలమో ముఖ్యమంత్రికి CRDA అధికారులు వివరించారు. మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిపారు. సచివాలయం వెనుక పక్కనున్న ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి.? ముహూర్తం తదితర అంశాలపై సీఎం చర్చించారు. సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని CRDA కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. గతంలో ఉద్ధండరాయునిపాలెం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల కోసం వినియోగించాలని నిర్ణయించారు.
తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో పక్కా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నివైపుల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ రాజధానులు ప్లాన్ చేసుకుంటున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మైండ్ బ్లాంక్ అవుతోంది.. పక్కా విజన్తో చంద్రబాబు తన నిర్ణయాలు ఎలా అమలు చేస్తారనే అంశానికి అమరావతి నిర్మాణం మరోసారి ప్రూవ్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు ఆర్ధిక నిపుణులు.. అమరావతితో బ్రాండ్ చంద్రబాబు ఇమేజ్ డబుల్ అయిందని చెబుతున్నారు… ఇప్పటికే, సైబరాబాద్ సిటీ నిర్మాతగా ఆయనకు ఉన్న ఇమేజ్ అమరావతి నిర్మాణంతో పదింతలు పెరగడం ఖాయం.. దేశ చరిత్రలోనే ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది..