టాలీవుడ్లో హీరోయిన్స్ .. నటన పరంగా ఎన్ని మార్కులేయించుకున్నప్పటికీ.. వాళ్ళ మెయిన్ క్వాలిఫికేషన్ మాత్రం అందమే. ఆకర్షించే అందంతో పాటు.. ఆకట్టుకునే అభినయం కూడా ఉంటే.. అది యాడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే అవుతుంది. కానీ మాలీవుడ్ లో అలాకాదు. అందం అక్కడ సెకండరీ థింగ్. అభినయం మాత్రమే ప్రధానం. సాధారణంగా అక్కడ అగ్ర కథానాయికలందరూ ఎంతో అందంగా ఉంటారు కాబట్టి.. అది వారికి ఎప్పుడూ ప్రధాన క్వాలిఫికేషన్ కాకపోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అలా అని మలయాళ ప్రేక్షకులు అందాన్ని ఆస్వాదించరని కాదు. అభినయం కూడా గ్లామర్ గానే ఉండాలని అనుకొనే బ్యాచ్ అది. అందుకే ఇక్కడ ఔట్ డేటెడ్ భామలంతా.. ఎంచక్కా మలయాళ ఇండస్ట్రీలో ఫ్రెష్ గా రీఛార్జ్ అవుతున్నారు. అది కూడా అక్కడ సూపర్ స్టార్స్ తోనే కావడం షాకింగ్ పాయింట్.
తొంభైల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగిన మీనా.. ఇప్పుడు ఇక్కడ కథానాయికగా నటించడానికి మన జనం ఏమాత్రం ఒప్పుకోరు. కానీ మీనా మలయాళంలో మోహన్ లాల్ సరసన లాస్ట్ ఇయర్ ‘ముందిరివల్లిగళ్ తళురిక్కుమ్ బోల్’ అనే సినిమాలో నటించి సూపర్ హిట్టు ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు దృశ్యంలో కూడా ఆయన సరసన నటించి అప్పుడూ హిట్టు కొట్టింది. అలాగే.. మన తెలుగమ్మాయి స్వాతి రెడ్డి హీరోయిన్ గా ఇక్కడ మంచి పేరు తెచ్చుకొని . గ్రాడ్యువల్ గా కనుమరుగై.. ఆపై తెరమరుగైంది. ఆ టైమ్ లోనే అమ్మడు మలయాళంలో పలు చిత్రాల్లో కథానాయికగా నటించి.. అభినయం పరంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ భామ కూడా లాస్టియర్ యంగ్ సూపర్ స్టార్ జయసూర్య సరసన .. ‘త్రిశ్శూర్ పూరమ్’ అనే మూవీలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి అందాల త్రిష కూడా జాయిన్ అయిపోయింది. కథానాయికగా అమ్మడు తమిళ, తెలుగులో ఔట్ డేటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఇక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆమెతో స్టార్ హీరోలు నటించే సీన్ లేదిక్కడ. కానీ.. మలయాళంలో త్రిష . ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ మోహన్ లాల్ సరసనే కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. నిజానికి త్రిష .. హీరోయిన్ గా చాలా లేట్ గా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. రెండేళ్ళ క్రితం మలయాళంలో వచ్చిన‘ హే జూడ్’ అనే సినిమా ద్వారా త్రిష కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమ్మడి సరసన యంగ్ సూపర్ స్టార్ నివిన్ పాలీ నటించాడు. తాజాగా ఇప్పుడు ‘ రామ్’ అనే మూవీతో మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దృశ్యం మలయాళ వెర్షన్ దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు. దీన్ని కూడా దృశ్యం తరహాలోనే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించనుండడం విశేషం. మరి త్రిష కి రామ్ సినిమా ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్పిపెడుతుందో చూడాలి.
జగన్కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్కి ఝలక్...