రైల్వే శాఖ కోవిడ్ నిబంధనలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో మాస్క్ ధరించకపోయినా, ఉమ్మినా రూ.500 జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ జరిమానా వసూలు చేస్తామని పేర్కొంది. ఈ నిబంధనలు ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ పాం టిక్కెట్ల ధరలను కూడ రైల్వే శాఖ పెంచేసింది. దేశంలో రోజువారీ కేసులు పెరుగుతున్నాచాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మాస్క్ లు ధరించకుండా బయట తిరిగే వారికి రూ. వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నాయి.
Also read:ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని చూశారా?











