భారతీయ రైల్వే చేపట్టిన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనరైల్వే బ్రిడ్జ్ .. జమ్ము కాశ్మీర్, చీనాబ్ నదిపై శరవేగంగా సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. ‘రైల్వే శాఖ మరొక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్దమవుతుంది. చీనాబ్ నదిపై సిద్దమవుతున్న.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంతో మన రైల్వే శాఖ తమ నైపుణ్యంతో మరో మైలు రాయిని అందుకోబోతున్నారు.’ అంతేకాదు.. దానికి సంబంధించన ఫొటోను కూడా షేర్ చేశారు రైల్వే మంత్రి.
Infrastructural Marvel in Making: Indian Railways is well on track to achieve another engineering milestone with the steel arch of Chenab bridge reaching at closure position.
It is all set to be the world's highest Railway bridge 🌉 pic.twitter.com/yWS2v6exiP
— Piyush Goyal (@PiyushGoyal) February 25, 2021
చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొంకణ్ రైల్వే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉద్ధమ్పూర్-శ్రీనగర్-బారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుగా 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2021 మార్చి నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Must Read ;- కళ్లు చెదిరే సౌకర్యాలతో ‘ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్