కామారెడ్డి: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి కరోనా బెడద తప్పలేదు. ఈ మహమ్మారి తీవ్రతతో దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ఈ దేవాలయాన్ని తెరవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోరిక మేరకు ఆలయ కమిటీ దేవాలయాన్ని తెరిచారు. శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసం రావడంతో బాటు కరోనా ఉదృతి తగ్గకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని అధికారులు తెలియచేశారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











