చత్తీస్ గఢ్ రాష్ర్టం బీజాపూర్ కాల్పుల్లో విజయనగరంలోని గాజుల రేగకు చెందిన సీఆర్ పీఎఫ్ కోబ్రా కమాండర్ జగదీశ్ చనిపోయారు. సోమవారం ఆయన పార్థివదేశం సొంతూరికి చేరుకుంది. స్థానిక యువత, ప్రజలు, కుటుంబ సభ్యలు దేశ జెండాను, ఆయన చిత్ర పటాలను పట్టుకొని నివాళులు అర్పించారు. జగదీశ్ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగదీశ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని స్థానికులు ఏడవడం ప్రతిఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. అండగా ఉంటానన్న నీవు.. మమ్మిల్ని వదిలి వెళ్లావా.. కొడుకా అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మంగళవారం ఆయన జగదీశ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











