రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన పోస్ట్ పై రాజకీయంగా చర్చ జరుగుతోంది. “వకీల్ సాబ్ గారు అమరావతికి దారెటు అనే విషయంలో ముందు నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు అనడానికి ఈ *రోజున మూడు రాజధానులకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయడమే దానికి అర్ధం*. బహుశా బీజేపీ వారు రాష్ట్రంలో ఏవిధమైన ప్రజాధారణ లేకుండా జనసేనాను అడ్డుపెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా ఎదగడానికి జనసేనాను తప్పుదోవ పట్టిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనా జనసేన వారు అమరావతి విషయంలో మరింత స్పష్టమైన వైఖరితో పోరాడాల్సిన అవసరం కనబడుతోంది” అంటూ పోస్ట్ పెట్టారు.
ఆయన పెట్టిన పోస్టుపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘జనసేనాని పరోక్షంగా వైసీపీ ని మద్దతు ఇస్తున్నాడు. నమ్మదగ్గమనిషి కాడు’ అంటూ కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం మీరు జనసేనలో చేరబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నారు.ఎప్పుడూ లేనిది శ్రీనివాస్ ఎందుకు జనసేనపై కామెంట్ చేశారనే చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఆదిరెడ్డి భవాని పార్టీ మార్పుపై వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచార నేపథ్యంలోనే జనసేన వారు అమరావతి విషయంలో మరింత స్పష్టమైన వైఖరితో పోరాడాల్సిన అవసరం కనబడుతోందని కామెంట్ చేయడం పలురకాల అనుమానాలకు తావిస్తోంది.
మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలిపేలా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ ఆలోచన చేస్తుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి, టీడీపీని ఇరుకున పెట్టె ఆలోచనతో వైసీపీ అందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వాసుపల్లి గణేష్ ను తమ పార్టీలోకి తీసుకున్న వైసీపీ మరికొందరు ఎమ్మెల్యేలపై దృష్టిసారించింది. వీరిలో అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని పేర్లు ప్రదానంగా వినబడుతున్నాయి. ఆదిరెడ్డి భవాని వైసీపీలో చేరడం ఖాయమని వార్తల నేపథ్యంలో శ్రీనివాస్ చేసిన పోస్ట్ అనుమానాలను పెంచింది. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగకతప్పదు.
*"వకీల్ సాబ్"* గారు *"అమరావతికి దారెటు"* అనే విషయంలో ముందు నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు అనడానికి ఈ *రోజున…
Posted by Adireddy Srinivas on Monday, 21 September 2020