ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ వలనే. అందుకే ముఖ్య మంత్రయినా.. ప్రధాన మంత్రయినా.. వాళ్లకు ఆ పదవులు కట్టబెట్టిన పార్టీకి.. ఆ పార్టీ కార్యకర్తలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్.. ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నా.. సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేశ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడుల సాధన, పరిపాలన వ్యవహారాలతో బిజీగా ఉన్నామని సాకులు చెప్పి సెక్రటేరియట్కు, ప్యాలెస్లకే పరిమితమైన నేతలను చూశాం. కానీ అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ ఇద్దరు ఎన్ని పనులు ఉన్నా.. నిత్యం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.
ప్రజా దర్బార్ పేరుతో లోకేశ్ టైమ్ టు టమ్ తన నియోజకవర్గం ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. తనకు సమయం లేని సందర్భాల్లోనూ తన టీమ్ ద్వారా అవసరంలో ఉన్న వాళ్లకు తక్షణ సాయం అందించే ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా కార్యకర్తలకు జీవిత భీమా సౌకర్యం కల్పించిన పార్టీగా టీడీపీకి ఖ్యాతి తీసుకొచ్చిన ఘనత కూడా లోకేశ్కే దక్కుతుంది. నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అన్ని పదవుల్లో పార్టీ కోసం పని చేసిన వారకే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ ఫస్ట్.. కార్యకర్తలే బాసులు అని స్పష్టం చేస్తోంది టీడీపీ అగ్ర నాయకత్వం











