రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఆదిపురుష్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండు అప్ డేట్స్ కూడా వచ్చాయి. అవేంటంటే ఇందులో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారట. అజయ్ దేవ్ గణ్ తో ఓంరౌత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇందులో అజయ్ దేవ్ గణ్ శివుడి పాత్రను పోషిస్తాడని అంటున్నారు. ఇక సీత పాత్రకు ఇప్పటికే చాలా పేర్లను పరిశీలించారట. కీర్తి సురేష్ ఈ పాత్రను పోషిస్తుందని తొలుత వార్తలొచ్చాయి.
ఆ తర్వాత ఊర్వశి రౌటేలా పేరు తెర మీదికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’లో చేసిన కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ పేరు వెల్లడించాల్సి ఉంది. విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నిషియన్లను రప్పిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ చిత్రాలకు పనిచేసిన వారితో నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. దీనికి త్రీడీ గ్రాఫిక్స్ వాడనున్నారు.
గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో పూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణుడిగా సయిఫ్ అలీఖాన్ రావణాసురడి పాత్రను పోషించబోతున్నట్లు అధికారంగానే ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సినిమా చేస్తారు. మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలూ క్రేజీ ప్రాజెక్టులుగానే చెప్పాలి.