ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి థర్మేంద్ర ప్రధాన్ను ఏపీ బీజేపీ నేతలు కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రవేటీకరణపై పునరాలోచన చేయాలని కోరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ , మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై అన్ని పార్టీలు,కార్మిక సంఘాలు , నిర్వాసితులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్చించడం గమనార్హం.
Must Read ;- ఒడిశా పెత్తనం.. పథకం ప్రకారం విశాఖ ఉక్కు నిర్వీర్యం