ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రానికి అడుగుపెట్టనున్నారు.. హస్తినలో అడుగు పెట్టిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలు షురూ కానున్నాయి.. మొదట ఆయన ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.. పని రాక్షసుడిగా ముద్ర పడిన చంద్రబాబు సాధారణంగా సెలవులు తీసుకోరు.. ఆయన విదేశాలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా.. రాజకీయాలతోనే ఫుల్ బిజీగా ఉంటారు.. ఆయన థింక్ పాలిటిక్సే కాదు… ఈట్ పాలిటిక్స్, స్లీప్ పాలిటిక్సే కూడా.. అలాంటి చంద్రబాబు తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని నాలుగు రోజులు ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపారు..
ఢిల్లీలో సోమవారం రాత్రికి అడుగుపెట్టనున్న చంద్రబాబు ముందుగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. మంగళవారం ఉదయం 10.30కి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిలో భేటీ కానున్నారు.. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్పై ఆయనతో చర్చించనున్నారు.. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ సందర్శించాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు.. ఆ తరవాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్తో సమావేశం కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..
మధ్యాహ్నం ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.. ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ స్థానంపై చర్చించనున్నారు చంద్రబాబు.. ఈ స్థానాన్ని బీజేపీ నేతలు ఎవరికి కేటాయిస్తారనేది కీలకంగా మారనుంది.. ఈ స్థానం నుండి తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి కేటాయించి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.. ఆ మంత్రి పదవి ఏపీ కోటా నుండి దక్కనుందనేది మరో కీలక అంశం.. దీంతో, చంద్రబాబు – అమిత్ షా భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడనుంది….
మరోవైపు, విజయసాయి రెడ్డికి బీజేపీలో లైన్ క్లియర్ అయిందని ఢిల్లీ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్తోపాటు మరికొన్ని స్కామ్లలో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారనున్నారని, జగన్కి సంబంధించి కీలక సమాచారం అందించనున్నారని సమాచారం.. ఆయనకు ఎంపీ పదవి ఇవ్వరని, బీజేపీలో జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి ఇవ్వాలని విజయసాయి రెడ్డి కోరుతున్నారు.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు.. ఈ అంశంపైనా చంద్రబాబుతో అమిత్ షా చర్చించనున్నారని తెలుస్తోంది..
మొత్తమ్మీద, ఢిల్లీ వేదికగా ఏపీ అభివృద్దిపై చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించారు.. ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ట్విస్టులు, టర్న్లు తీసుకుంటాయో చూడాలి..