January 28, 2023 2:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

ప్రజలు ఉచిత పథకాలు చూసి సంబర పడవచ్చేమోగానీ ఇప్పుడున్న ధరలతో ఆ సొమ్మంతా ఎక్కడికి పోతోంది అని ఆలోచించే వారే కరవయ్యారు. మరో పక్క పన్నుల భారం కూడా. ఈ ధరాఘాతంపై విశ్లేషణాత్మక కథనం చదవండి.

January 11, 2023 at 3:30 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు లేదని ప్రజలు వాపోతున్నారు. అధిక ధరలు,పన్నులు సామాన్యులకు పెనుభారంగా పరిణమించి వారి జీవితాల్లో గాడాంధకారం అలుముకొన్నది. ఈ ధరాఘాతాన్నిఎలా భరించాలి అంటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పేద,మధ్య తరగతి ప్రజల పై అధిక ధరల భారం మోయలేనంతగా ఉంది.పెట్రోలు ,డీజీలు,గ్యాస్, ఆహార,నిత్యావసర వస్తువులు,కూరగాయలు సమస్త వస్తువుల ధరలు భరించలేనంతగా పెరిగాయి .జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ళ పరిపాలన సమస్తం ప్రజా ఫీడన పరాయణమే తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. బడుగు జీవులకు భాధలు తప్ప బతుకు లేకుండా చేశారు.భాధ్యత లేని జగన్ ఏలుబడిలో పెరుగుతున్న ధరల దాటికి,పన్నుల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి. ప్రజల పై ఏడా,పెడా పన్నుల భారం మోపి జలగల్లా జనం రక్తాన్ని కాసులుగా పిండుకొంటున్నారు. ఒక పక్కన ధరలు ఆకాశాన్ని అంటుతుంటే,ప్రభుత్వం ప్రజల పై పన్నులు మీద పన్నులు వేసి డబ్బులు గుంజుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పడం అంటే ఎవరి డబ్బుతో ఎవర్ని బాగు చేస్తున్నట్లు ?ప్రభుత్వం సంక్షేమం పధకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్నది ఎంత?

పన్నుల రూపంలో, మరియు మధ్యం ద్వారా గుంజుకొంటున్నది ఎంతో ప్రజలు కూడా ఒకసారి అర్ధం చేసుకోవాలి.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.పెట్రోలు,డీజీలు పై పన్నులు తగ్గించడానికి అంగీకరించని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఒక శాతం ఆహార ధరల పెరిగితే కోటి మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి జారుకొంటారని ఆ మధ్య ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ హెచ్చరించారు.జగన్ చెబుతున్న సంక్షేమం ఏమో కానీ సమస్త ధరలూ పెరిగి ధరాఘాతంతో రాష్ట్రంలో సామాన్యులు,మధ్యతరగతి ప్రజలు మాత్రం దివాళా అంచుకి చేరారు. జగన్ రెడ్డి అరకొర సంక్షేమం అమలు చేసి తానూ సంక్షేమ రాజ్య విధాతగా ప్రచారం చేసుకొంటూ జనం చెవిలో ఎలా పూలు పెడుతున్నారు.

జగన్ కి జనం భాధలు పట్టడం లేదు.అధిక ధరల మంటల్లో బడుగుల బతుకులు కాలిపోతున్నాయి.పంట దిగుబడి బాగానే వున్నా మార్కెట్ లో బియ్యం ధర కేజీ రూ 50 నుంచి 55 వరకు పలుకు తున్నది ఇక నిత్యావసర వస్తువుల ధరలు స్వతంత్ర భారతంలో ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటి సారి. వంట గ్యాస్‌, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు, వంటనూనెల ధరలు, అన్ని రకాల పప్పులు ధరలను ఒకసారి పరిశీలిస్తే 2014 లో కందిపప్పు కేజీ రూ 75 వుండగా,నేడు కేజీ కంది పప్పు రూ 130 అయింది,పెసర పప్పు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 120 కి చేరింది.మినప గుండ్లు కేజీ రూ 70 వుండగా నేడు కేజీ రూ 130 పెరిగింది. పల్లీలు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 130 కి చేరింది .వేరుశనగ నూనె కేజీ రూ 110 వుండగా నేడు 170 అయింది.సన్ ఫ్లవర్ ఆయిల్ కేజీ రూ70 వుండగా నేడు కేజీ రూ 150 కి పెరిగింది. సామాన్యులు వాడే పామాయిల్ ధర అంతే వారికి అందుబాటు లేదు .

పంచదార కేజీ రూ 26 వుండగా నేడు కేజీ రూ 50 అయింది.చింతపండు కేజీ రూ 100 వుండగా నేడు కేజీ రూ 250 అయింది. కూరగాయల ధరలు మండి పోతున్నాయి.పెట్రోలు లీటరు రూ 76 వుండగా నేడు లీటరు 110 కి చేరింది.డీజీలు లీటరు 70 వుండగా నేడు 100 అయింది.గ్యాస్ బండ రూ 450 వుండగా నేడు గ్యాస్ బండ రూ 1100 దాటింది.లారీ ఇసుక రూ 10 వేలు వుండగా,నేడు లారీ ఇసుక రూ 40 వేల నుండి రూ 50 వేలు అమ్ముతుంది.స్టీలు,సిమెంట్ ధరలు భగ్గు మంటున్నాయి.సిమెంట్ బస్తా రూ 450 కి చేరింది.టన్ను స్టీలు ధర 60 వేలు పలుకుతుంది.ధరలు పెరిగి ప్రజలు ఆహాకారాలు చేస్తున్నా పెరిగిన దరల పై ముఖ్యమంత్రి జగన్ ధరల పెరుగుదల పై సమీక్షీoచి ఎరుగరు.

భాధ్యతలేని జగన్ ఏలుబడిలో ధరల ధాటికి,పన్నుల పెంపుకు,విద్యుత్తుచార్జీలు,ఆర్టీసీ చార్జీల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి? రాష్ట్ర ఖజానా కుదేలు కావడం తో పధకాలు అమలు చెయ్యడం కోసం అని సమస్త పన్నులు,చార్జీలు పెంచి ప్రజలను తెగబడి దోచుకొంటున్నారు.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను,మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.జగన్ పాలనలో సమస్త ధరలు పెరిగి జనం దిక్కులేని వారు అయ్యారు..

ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరోవైపు పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు, పంచదారకు ఎగనామం పెట్టింది జగన్ ప్రభుత్వం. పండగొస్తే రేషన్‌ షాపుల్లో సంక్రాంతి కానుక కింద అదనంగా సరుకు లిచ్చిoది గత ప్రభుత్వం.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పధకానికి గండి కొట్టి పేదల పొట్టకొట్టింది. ప్రతి నెలా ఇచ్చే రేషన్ సరుకులకు కత్తెర వేసి పేదలకు కాస్తో కూస్తో అందుతున్న ఆసరాకు గండికొట్టారు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యంతో పాటు కిలో కందిపప్పు, అర కిలో చక్కెర పంపిణీ చేస్తామంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక కోటీ 45 లక్షల కార్డులుండగా, 14.5 వేల టన్నుల కందిపప్పు, 7 వేల టన్నుల పంచదార సేకరించాలి. కానీ పౌరసరఫరాల శాఖ వద్ద పది శాతం నిల్వలే ఉన్నాయి. అందరికీ ఎలా పంపిణీ చేస్తారు? కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకునే ఎత్తేగా? సరఫరాదారులకు పాత బకాయిలు పేరుకు పోయినందున సేకరణ జరగలేదంటున్నారు.

పేదలకు అందించే కొద్దిపాటి సరుకులకయ్యే సొమ్ముకూడా ఖజానాలో లేదు. కందిపప్పు, చక్కెర పంపిణీ అస్తవ్యస్తంగా తయారైందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. కందిపప్పు 30 శాతం మందికి, పంచదార 70 శాతం మందికే అందుతున్నాయి. అదేంటంటే, పేదలు తీసుకోవట్లేదని సాకులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక మాదిరి క్వాలిటీ కందిపప్పు కిలో రూ.110 పలుకుతోంది. అదే వాల్‌మార్ట్‌, రిలయన్స్‌, వంటి సూపర్‌ బజార్లలోనైతే రూ.140. అంత ధర పెట్టి పేదలు కొని తినలేకపోతున్నారు. తక్కువ ధరకు వచ్చే రేషన్‌ దుకాణాల వంక ఆశగా చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వమేమో డిమాండ్‌ లేదని తప్పించుకుంటోంది. ఇచ్చే అరకొరకూ ధర పెంచేసింది. రేషన్‌ షాపులో కిలో కందిపప్పు రూ.40 వున్నధరను రూ.67 చేశారు.

పంచదార రూ.20 కాస్తా రూ.26 అయింది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో రేషన్‌ దుకాణాల్లో బియ్యంతోపాటు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయల వంటి 14 రకాల నిత్యావసరాలను అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒకటీ రెండు సరకులకూ కోతలు పెట్టడం పేదల పక్షపాతం ఎలా అవుతుంది? ఇంటింటికీ వలంటీర్ల ద్వారా ప్యాకింగ్‌ సంచుల్లో రేషన్‌ సరఫరా చేస్తామని చేతులెత్తేసింది. సన్న బియ్యం అని చెప్పి మాట మార్చి తినగలిగే నాణ్యమైన బియ్యం అంది. ప్రత్యేక వాహనాలను వీధి మూలమలుపుల్లో నిలబెట్టి రేషన్‌ తీసుకోమంటోంది. కూలి పనులు చేసుకొనే బీద బిక్కి రేషన్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చింది. రేషన్‌ డీలర్ల వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది.

ఎ.పి.లో రేషన్‌ కార్డుల ఏరివేత చేపట్టి ఏడాదిలో నాలుగు లక్షల కార్డులు తగ్గించారు. సచివాలయాల్లో కొత్త కార్డుల జారీ జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ప్రభుత్వం భారాన్ని తగ్గించుకునేందుకు పేదల కూటికి కోతలకు దిగుతోంది. ప్రతిపక్షనాయకుడిగా జగన్ వున్నప్పుడు పెట్రోలు,డీజీలు పై బాదుడే,బాదుడు అంటూ గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.మన రాష్ట్రంలోనే పెట్రోలు,డీజీలు పై వున్న పన్నులు ఏ రాష్ట్రంలో లేవని గగ్గోలు పెట్టారు.నేడు జగన్ ప్రభుత్వం పెట్రోలు పై 31 శాతం,డీజీలు పై 22.5 శాతం వ్యాట్ విధించి ప్రజల నడ్డి విరుస్తుంది.అత్యధిక పన్నులు ఏపి లోనే ఉన్నాయి. పెట్రోల్‌పై వ్యాట్‌ 31 శాతం, డీజిల్‌పై వ్యాట్‌ 22.25 శాతం. ఇవి కాకుండా లీటర్‌పై రూ.4 సెస్‌, రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. అత్యధిక పన్నులున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది.

అందుకే మన రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోలు ధరలు ఎక్కువ. కేంద్రం పన్నులు పెంచడంతో ఆదాయం పెంచుకుంటున్న ఎపి ప్రభుత్వం, సెస్‌లు, సర్‌ఛార్జీలలో కేంద్రం వాటా ఇవ్వకపోయినా పెద్దగా మాట్లాడట్లేదు. ఇదే సమయంలో అనేక రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోగా ఆంధ్రప్రదేశ్ పన్నులు తగ్గించేందు.పెట్రోలు,డీజీలు, గ్యాస్ ధరలే కాదు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను కాల్చుకు తింటున్న తరుణంలో సర్ధుబాటు వ్యయం పేరిట భారీగా విధ్యుత్తు చార్జీలు 7 సార్లు పెంచి మూడేళ్ళలో ఒక్క విధ్యుత్తు రంగంలోనే దశల వారీగా,రక,రకాల పేర్లతో ప్రజల పై రూ 17 వేల కోట్లు చార్జీల భారం మోపారు. ప్రజలు ఉపాధి కోల్పోయి ప్రజలు జీవనం దుర్భరంగా మారింది.ఈ పరిస్థితుల్లో ప్రజలకు రాయితీలు ఇచ్చి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు,పన్నులు,ఛార్జీలు పెంచి ప్రజా జీవనం మరింత దుర్భరం చెయ్యడం అమానుషం.

ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు ఉపయోగ పడని తాత్కాలిక,అరకొర తాయిలాల అమలును మద్యం అమ్మకాలు ద్వారానే తానూ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాను అన్నారు జగన్ రెడ్డి.పేద కుటుంబాలను ఛిద్రం చేసే మద్యం డబ్బుతో చేసేది సంక్షేమం అలా అవుతుందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. సంపూర్ణ మద్యనిషేధం వల్లే వేసి గద్దెనెక్కాక నాసిరకం మద్యంతో మార్కెట్లను ముంచెత్తి కాపురాలను గుల్ల చేస్తూ,ఖజానా నింపుకోవడం సంక్షేమం ఎలా అవుతుంది?పన్నులు భారాన్ని,చార్జీల భారాన్ని పెంచుతూ ప్రజల జేబులు గుల్ల చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుంది?నవరత్నాలను మద్యం ఆదాయంలో ముంచి బడుగుల బతుకులు బుగ్గి చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

Tags: #topstoriesap newschandrababuEditorspickLatest Newsleotopprice hikes in apys jagan
Previous Post

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

Next Post

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

by Leo Editor
January 6, 2023 4:17 pm

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In