September 15, 2026 7:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

ప్రజలు ఉచిత పథకాలు చూసి సంబర పడవచ్చేమోగానీ ఇప్పుడున్న ధరలతో ఆ సొమ్మంతా ఎక్కడికి పోతోంది అని ఆలోచించే వారే కరవయ్యారు. మరో పక్క పన్నుల భారం కూడా. ఈ ధరాఘాతంపై విశ్లేషణాత్మక కథనం చదవండి.

January 11, 2023 at 3:30 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు లేదని ప్రజలు వాపోతున్నారు. అధిక ధరలు,పన్నులు సామాన్యులకు పెనుభారంగా పరిణమించి వారి జీవితాల్లో గాడాంధకారం అలుముకొన్నది. ఈ ధరాఘాతాన్నిఎలా భరించాలి అంటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పేద,మధ్య తరగతి ప్రజల పై అధిక ధరల భారం మోయలేనంతగా ఉంది.పెట్రోలు ,డీజీలు,గ్యాస్, ఆహార,నిత్యావసర వస్తువులు,కూరగాయలు సమస్త వస్తువుల ధరలు భరించలేనంతగా పెరిగాయి .జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ళ పరిపాలన సమస్తం ప్రజా ఫీడన పరాయణమే తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. బడుగు జీవులకు భాధలు తప్ప బతుకు లేకుండా చేశారు.భాధ్యత లేని జగన్ ఏలుబడిలో పెరుగుతున్న ధరల దాటికి,పన్నుల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి. ప్రజల పై ఏడా,పెడా పన్నుల భారం మోపి జలగల్లా జనం రక్తాన్ని కాసులుగా పిండుకొంటున్నారు. ఒక పక్కన ధరలు ఆకాశాన్ని అంటుతుంటే,ప్రభుత్వం ప్రజల పై పన్నులు మీద పన్నులు వేసి డబ్బులు గుంజుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పడం అంటే ఎవరి డబ్బుతో ఎవర్ని బాగు చేస్తున్నట్లు ?ప్రభుత్వం సంక్షేమం పధకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్నది ఎంత?

పన్నుల రూపంలో, మరియు మధ్యం ద్వారా గుంజుకొంటున్నది ఎంతో ప్రజలు కూడా ఒకసారి అర్ధం చేసుకోవాలి.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.పెట్రోలు,డీజీలు పై పన్నులు తగ్గించడానికి అంగీకరించని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఒక శాతం ఆహార ధరల పెరిగితే కోటి మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి జారుకొంటారని ఆ మధ్య ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ హెచ్చరించారు.జగన్ చెబుతున్న సంక్షేమం ఏమో కానీ సమస్త ధరలూ పెరిగి ధరాఘాతంతో రాష్ట్రంలో సామాన్యులు,మధ్యతరగతి ప్రజలు మాత్రం దివాళా అంచుకి చేరారు. జగన్ రెడ్డి అరకొర సంక్షేమం అమలు చేసి తానూ సంక్షేమ రాజ్య విధాతగా ప్రచారం చేసుకొంటూ జనం చెవిలో ఎలా పూలు పెడుతున్నారు.

జగన్ కి జనం భాధలు పట్టడం లేదు.అధిక ధరల మంటల్లో బడుగుల బతుకులు కాలిపోతున్నాయి.పంట దిగుబడి బాగానే వున్నా మార్కెట్ లో బియ్యం ధర కేజీ రూ 50 నుంచి 55 వరకు పలుకు తున్నది ఇక నిత్యావసర వస్తువుల ధరలు స్వతంత్ర భారతంలో ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటి సారి. వంట గ్యాస్‌, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు, వంటనూనెల ధరలు, అన్ని రకాల పప్పులు ధరలను ఒకసారి పరిశీలిస్తే 2014 లో కందిపప్పు కేజీ రూ 75 వుండగా,నేడు కేజీ కంది పప్పు రూ 130 అయింది,పెసర పప్పు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 120 కి చేరింది.మినప గుండ్లు కేజీ రూ 70 వుండగా నేడు కేజీ రూ 130 పెరిగింది. పల్లీలు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 130 కి చేరింది .వేరుశనగ నూనె కేజీ రూ 110 వుండగా నేడు 170 అయింది.సన్ ఫ్లవర్ ఆయిల్ కేజీ రూ70 వుండగా నేడు కేజీ రూ 150 కి పెరిగింది. సామాన్యులు వాడే పామాయిల్ ధర అంతే వారికి అందుబాటు లేదు .

పంచదార కేజీ రూ 26 వుండగా నేడు కేజీ రూ 50 అయింది.చింతపండు కేజీ రూ 100 వుండగా నేడు కేజీ రూ 250 అయింది. కూరగాయల ధరలు మండి పోతున్నాయి.పెట్రోలు లీటరు రూ 76 వుండగా నేడు లీటరు 110 కి చేరింది.డీజీలు లీటరు 70 వుండగా నేడు 100 అయింది.గ్యాస్ బండ రూ 450 వుండగా నేడు గ్యాస్ బండ రూ 1100 దాటింది.లారీ ఇసుక రూ 10 వేలు వుండగా,నేడు లారీ ఇసుక రూ 40 వేల నుండి రూ 50 వేలు అమ్ముతుంది.స్టీలు,సిమెంట్ ధరలు భగ్గు మంటున్నాయి.సిమెంట్ బస్తా రూ 450 కి చేరింది.టన్ను స్టీలు ధర 60 వేలు పలుకుతుంది.ధరలు పెరిగి ప్రజలు ఆహాకారాలు చేస్తున్నా పెరిగిన దరల పై ముఖ్యమంత్రి జగన్ ధరల పెరుగుదల పై సమీక్షీoచి ఎరుగరు.

భాధ్యతలేని జగన్ ఏలుబడిలో ధరల ధాటికి,పన్నుల పెంపుకు,విద్యుత్తుచార్జీలు,ఆర్టీసీ చార్జీల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి? రాష్ట్ర ఖజానా కుదేలు కావడం తో పధకాలు అమలు చెయ్యడం కోసం అని సమస్త పన్నులు,చార్జీలు పెంచి ప్రజలను తెగబడి దోచుకొంటున్నారు.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను,మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.జగన్ పాలనలో సమస్త ధరలు పెరిగి జనం దిక్కులేని వారు అయ్యారు..

ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరోవైపు పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు, పంచదారకు ఎగనామం పెట్టింది జగన్ ప్రభుత్వం. పండగొస్తే రేషన్‌ షాపుల్లో సంక్రాంతి కానుక కింద అదనంగా సరుకు లిచ్చిoది గత ప్రభుత్వం.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పధకానికి గండి కొట్టి పేదల పొట్టకొట్టింది. ప్రతి నెలా ఇచ్చే రేషన్ సరుకులకు కత్తెర వేసి పేదలకు కాస్తో కూస్తో అందుతున్న ఆసరాకు గండికొట్టారు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యంతో పాటు కిలో కందిపప్పు, అర కిలో చక్కెర పంపిణీ చేస్తామంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక కోటీ 45 లక్షల కార్డులుండగా, 14.5 వేల టన్నుల కందిపప్పు, 7 వేల టన్నుల పంచదార సేకరించాలి. కానీ పౌరసరఫరాల శాఖ వద్ద పది శాతం నిల్వలే ఉన్నాయి. అందరికీ ఎలా పంపిణీ చేస్తారు? కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకునే ఎత్తేగా? సరఫరాదారులకు పాత బకాయిలు పేరుకు పోయినందున సేకరణ జరగలేదంటున్నారు.

పేదలకు అందించే కొద్దిపాటి సరుకులకయ్యే సొమ్ముకూడా ఖజానాలో లేదు. కందిపప్పు, చక్కెర పంపిణీ అస్తవ్యస్తంగా తయారైందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. కందిపప్పు 30 శాతం మందికి, పంచదార 70 శాతం మందికే అందుతున్నాయి. అదేంటంటే, పేదలు తీసుకోవట్లేదని సాకులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక మాదిరి క్వాలిటీ కందిపప్పు కిలో రూ.110 పలుకుతోంది. అదే వాల్‌మార్ట్‌, రిలయన్స్‌, వంటి సూపర్‌ బజార్లలోనైతే రూ.140. అంత ధర పెట్టి పేదలు కొని తినలేకపోతున్నారు. తక్కువ ధరకు వచ్చే రేషన్‌ దుకాణాల వంక ఆశగా చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వమేమో డిమాండ్‌ లేదని తప్పించుకుంటోంది. ఇచ్చే అరకొరకూ ధర పెంచేసింది. రేషన్‌ షాపులో కిలో కందిపప్పు రూ.40 వున్నధరను రూ.67 చేశారు.

పంచదార రూ.20 కాస్తా రూ.26 అయింది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో రేషన్‌ దుకాణాల్లో బియ్యంతోపాటు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయల వంటి 14 రకాల నిత్యావసరాలను అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒకటీ రెండు సరకులకూ కోతలు పెట్టడం పేదల పక్షపాతం ఎలా అవుతుంది? ఇంటింటికీ వలంటీర్ల ద్వారా ప్యాకింగ్‌ సంచుల్లో రేషన్‌ సరఫరా చేస్తామని చేతులెత్తేసింది. సన్న బియ్యం అని చెప్పి మాట మార్చి తినగలిగే నాణ్యమైన బియ్యం అంది. ప్రత్యేక వాహనాలను వీధి మూలమలుపుల్లో నిలబెట్టి రేషన్‌ తీసుకోమంటోంది. కూలి పనులు చేసుకొనే బీద బిక్కి రేషన్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చింది. రేషన్‌ డీలర్ల వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది.

ఎ.పి.లో రేషన్‌ కార్డుల ఏరివేత చేపట్టి ఏడాదిలో నాలుగు లక్షల కార్డులు తగ్గించారు. సచివాలయాల్లో కొత్త కార్డుల జారీ జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ప్రభుత్వం భారాన్ని తగ్గించుకునేందుకు పేదల కూటికి కోతలకు దిగుతోంది. ప్రతిపక్షనాయకుడిగా జగన్ వున్నప్పుడు పెట్రోలు,డీజీలు పై బాదుడే,బాదుడు అంటూ గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.మన రాష్ట్రంలోనే పెట్రోలు,డీజీలు పై వున్న పన్నులు ఏ రాష్ట్రంలో లేవని గగ్గోలు పెట్టారు.నేడు జగన్ ప్రభుత్వం పెట్రోలు పై 31 శాతం,డీజీలు పై 22.5 శాతం వ్యాట్ విధించి ప్రజల నడ్డి విరుస్తుంది.అత్యధిక పన్నులు ఏపి లోనే ఉన్నాయి. పెట్రోల్‌పై వ్యాట్‌ 31 శాతం, డీజిల్‌పై వ్యాట్‌ 22.25 శాతం. ఇవి కాకుండా లీటర్‌పై రూ.4 సెస్‌, రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. అత్యధిక పన్నులున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది.

అందుకే మన రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోలు ధరలు ఎక్కువ. కేంద్రం పన్నులు పెంచడంతో ఆదాయం పెంచుకుంటున్న ఎపి ప్రభుత్వం, సెస్‌లు, సర్‌ఛార్జీలలో కేంద్రం వాటా ఇవ్వకపోయినా పెద్దగా మాట్లాడట్లేదు. ఇదే సమయంలో అనేక రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోగా ఆంధ్రప్రదేశ్ పన్నులు తగ్గించేందు.పెట్రోలు,డీజీలు, గ్యాస్ ధరలే కాదు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను కాల్చుకు తింటున్న తరుణంలో సర్ధుబాటు వ్యయం పేరిట భారీగా విధ్యుత్తు చార్జీలు 7 సార్లు పెంచి మూడేళ్ళలో ఒక్క విధ్యుత్తు రంగంలోనే దశల వారీగా,రక,రకాల పేర్లతో ప్రజల పై రూ 17 వేల కోట్లు చార్జీల భారం మోపారు. ప్రజలు ఉపాధి కోల్పోయి ప్రజలు జీవనం దుర్భరంగా మారింది.ఈ పరిస్థితుల్లో ప్రజలకు రాయితీలు ఇచ్చి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు,పన్నులు,ఛార్జీలు పెంచి ప్రజా జీవనం మరింత దుర్భరం చెయ్యడం అమానుషం.

ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు ఉపయోగ పడని తాత్కాలిక,అరకొర తాయిలాల అమలును మద్యం అమ్మకాలు ద్వారానే తానూ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాను అన్నారు జగన్ రెడ్డి.పేద కుటుంబాలను ఛిద్రం చేసే మద్యం డబ్బుతో చేసేది సంక్షేమం అలా అవుతుందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. సంపూర్ణ మద్యనిషేధం వల్లే వేసి గద్దెనెక్కాక నాసిరకం మద్యంతో మార్కెట్లను ముంచెత్తి కాపురాలను గుల్ల చేస్తూ,ఖజానా నింపుకోవడం సంక్షేమం ఎలా అవుతుంది?పన్నులు భారాన్ని,చార్జీల భారాన్ని పెంచుతూ ప్రజల జేబులు గుల్ల చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుంది?నవరత్నాలను మద్యం ఆదాయంలో ముంచి బడుగుల బతుకులు బుగ్గి చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

Tags: #topstoriesap newschandrababuEditorspickLatest Newsleotopprice hikes in apys jagan
Previous Post

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

Next Post

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist