ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్కు, ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ₹5లక్షల పూచీకత్తు ఉంటాలని కోర్టు పేర్కొంది. అలాగే ఇంకొన్న నియమాలు పాటించాల్సిందిగా కోర్టు తెలిపింది. అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
వీడియో కాన్ గ్రూప్కు సంబంధించి రూ.1875 కోట్ల మేర రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందాకొచ్చర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చందా కొచ్చర్ భర్తతో పాటు పాటు వీడియోకాన్ గ్రూప్కు చెందిన వేణుగోపాల్ దూత్ కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు. 2019, జనవరిలో ఈడీ వీరిపైన మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆపై చందాకొచ్చర్ను సెప్టంబర్ 7వ తేదీన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్న చందాకొచ్చర్కు నేడు బెయిల్ మంజూరు అయింది.
Must Read ;- నిన్న శ్రీలక్ష్మి, నేడు మరో లేడీ ఐఏఎస్.. వాటీజ్ గోయింగ్ ఆన్ ఇన్ జగన్ రూలింగ్?