ఐపీఎల్లో బెంగళూరు హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళుతోంది. ముంబయి వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సేన పదివికెట్ల తేడాతో విక్టరీ కొట్టేసింది. 178 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించేసింది.
పడిక్కల్ దంచేశాడు..
పడిక్కల్ తన మ్యాజిక్ చూపించాడు. ఓపెనర్లుగా వచ్చిన దేవ్దత్ పడిక్కల్ 52 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 16.3 ఓవర్లలోనే బెంగళూరు ఘన విజయం సాధించింది.
Must Read ;- ధోని సేన బోణీ.. పంజాబ్పై చెన్నై ఘన విజయం











