కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దీని కారణంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రాణాలు కోల్లోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన పేరు శ్రావణ్. బాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో సినిమాలకు తమ సంగీతంతో ప్రాణం పోసిన నదీమ్- శ్రావణ్ ద్వయంలో ఈయన ఒకరు. వీరిద్దరూ కలిసి ఎన్నో బాలీవుడ్ మూవీస్ కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ‘ఆశీకీ, పరదేశ్, రాజా హిందుస్థానీ లాంటి ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు.
ఇటీవల శ్రావణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్.ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింతగా విషమించింది. దాంతో గతరాత్రి 10 :15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు. శ్రావణ్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Must Read ;- సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ కన్నుమూత : కేసీఆర్, జగన్ సంతాపం