టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ పడితే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. వేదిక ఏదైనా, బౌలర్ ఎవరైనా పరుగులు రాబట్టడంలో విరాట్ మించినవారు ఎవరూ లేరనే చెప్పాలి. మైదానంలో ఒక బాధ్యతయుత కెప్టెన్ గా వ్యవహరించే కోహ్లీ ఫ్యామిలీ విషయంలోనూ అంతే బాధ్యతగా ఉంటాడు. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ముగిశాక పునె ఎయిర్ పోర్టు నుంచి ముంబైకు పయనమయ్యాడు. ఎయిర్ పోర్టులో భార్య అనుష్క బిడ్డను ఎత్తుకోగా, కోహ్లీ కూతురి లగేజీ మోస్తూ ఓ సాధారణ తండ్రిలా కనిపించాడు. కూతురు లగేజీ మోస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘విరాట్ చూసి తామెంతో నేర్చుకోవాలని, ఫ్యామిలీ వ్యవహారాల్లోనూ కోహ్లీ కింగ్’ అని అంటున్నారు ఫ్యాన్స్.
Must Read ;- అనుష్క వంటి అందమైన భార్య ఉండగా కుంగుబాటేల?
View this post on Instagram











