సంగం డెయిరీ దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్రను అక్రమ అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీ నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను పక్కదారి పట్టించేందుకే
రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, జగన్ రాక్షస ఆనందం పొందుతున్నాడని అన్నారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే, టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ, పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించుకోవాలని, దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Must Read ;- ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షస ఆనందం : నారా లోకేశ్











