బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కర్నూలులో కరోనాతో, బ్లాక్ ఫంగస్తో ప్రజలు చనిపోతుంటే వైసీపీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి ఇప్పటివరకు ఎందుకు మెజిస్ర్టేట ముందు హాజరుపర్చలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ను వెంటనే విడుదల చేయకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు అన్నారు.
డీజీపీకి లేఖ
టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తుండటంతో డీజీపీ గౌతమ్ కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టారని లేఖలో తెలిపారు. కక్ష పూరితంగానే జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారని, డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.
Must Read ;- కరోనా రోగులను గాలికొదిలేసి నిర్భంధాలపైనే దృష్టి: చంద్రబాబు











