తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు నాయకులు ముట్టడించే అవకాశాలు ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు మధ్య సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.
అంతకముందు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు తాను విశ్రమించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.