ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్సింగ్ను మావోయిస్టులు బందీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో బంధీగా ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్సింగ్కు విముక్తి కలిగింది. తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలో రాకేశ్వర్సింగ్ను మావోయిస్టులు వదిలేశారు. కొద్ది గంటల్లోనే బెటాలియన్కు జవాన్ చేరుకోనున్నాడు. రాకేశ్వర్సింగ్ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. చెప్పినట్లుగా కమాండర్ ను విడిచిపెట్టింది.
రాకేశ్వర్ సింగ్ విడుదల విషయమై పోలీసు అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జవాన్ ను విడిచిపెట్టడానికి మావోయిస్టులు అనువైన సమయం తీసుకోవడం, భద్రత దళాలు మాత్రం రాకేశ్వర్ సింగ్ విడుదల కానుండటంతో అడవుల్లో పెద్ద ఎత్తున మొహరించడం మళ్లీ కాల్పులకు దారి తీస్తుందా… అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
Must Read ;- అమర జవానుకు కన్నీటి వీడ్కోలు











