ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెన్నైఆటగాళ్లలో ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్ రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు పడకొట్టారు.
అదిరిపోయే ఆరంభం..
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్ కు గైక్వాడ్- డుప్లెసిస్ కలిసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాదాపుగా 10 రన్ రేట్ నమోదు చేశారు. ఓ దశలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే సీఎస్కే విక్టరీ కొట్టేస్తుందేమో అనే ఆనందం అభిమానుల్లో నెలకొంది.
సీఎస్కేకు రషీద్ బ్రేకులు..
సీఎస్కే దూకుడుకు రషీద్ బ్రేకులు వేశారు. అద్భుతమైన బంతితో 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్ను క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మొయిన్ అలీతో పాటు డుప్లెసిస్(56)ను వరుస బంతుల్లోనే పెవిలియన్కు చేర్చారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రైనా- జడేజా జోడీ మిగిలిన పనిని పూర్తి చేశారు. చెన్నైకు మంచి విజయాన్ని అందించారు.
Must Read ;- ధోని సేన బోణీ.. పంజాబ్పై చెన్నై ఘన విజయం











