ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ .. భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ లో యన్టీఆర్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తన సొంత నిర్మాణంలో రూపొందుతోన్న మెగాస్టార్ ‘ఆచార్య’ లోనూ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు చెర్రీ. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డాయి.
అయితే చెర్రీ ‘ఆచార్య’ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. కరోనా కన్నా ముందే ఆచార్య సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి లెక్క ప్రకారం. అయితే లాక్ డౌన్ కారణంగా .. చాలా లేట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టింది. ఈ లాక్ డౌన్ టైమ్ లోనే సాధారణ నటుడిగా ఉండే సోనూ రియల్ లైఫ్ హీరో అయిపోయాడు. అందుకే ఈ సినిమాలో అంతకు ముందు అతడి మీద రాసిన కొన్ని సీన్స్ ను ఆ తర్వాత అతడి వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చి.. అతడి కేరక్టర్ ను కూడా బాగా ఎక్స్ టెండ్ చేశారట.
అందులో భాగంగానే చెర్రీ, సోనూసూద్ మధ్య ‘ఆచార్య’ సినిమాలో అదిరిపోయే రేంజ్ లో ఒక రెయిన్ ఫైట్ ను చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య మేజర్ హైలైట్స్ లో ఈ రెయిన్ ఫైట్ కూడా ఒకటని చెప్పుకుంటున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ ను ఇటీవల ధర్మస్థలి సెట్స్ లో చిత్రీకరించారు. అలాగే అంతకు ముందు చిరంజీవి, సోనూ సూద్ పై కూడా ఒక పైట్ తీశారు.
కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 13న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ సినిమాలో సోనూసూద్ విలనిజం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- మీరు రెస్ట్ తీసుకోండి.. మేము టెస్ట్ తీసుకుంటాం అంటున్న సోనూ సూద్