పోలీసులు అంటేనే శాంతిభద్రతల రక్షణలో ముందుండేవాళ్లు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినవాళ్లు. మరి అలాంటివాళ్లే నిబంధనలను బ్రేక్ చేస్తే ఎలా.. అని ప్రశ్నిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నిబంధనలు పాటించని పోలీస్ సిబ్బందిపై తాజాగా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళా పోలీసులు వెళ్తున్నారు. హెల్మెట్ కూడా లేదు. దీంతో ఆయన వాళ్ల తీరును ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ బైక్పై ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేనా, మధ్యలో కూర్చున్న ఆమె, డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరి సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు. కలికాలం పోలీసులు’’ అంటూ ఫొటోను ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఈ ఫొటోను డీజీపీకి కూడా ట్యాగ్ చేయడంతో, నెటిజన్స్ పోలీసు సిబ్బందిని విమర్శిస్తున్నారు.
Must Read ;- మృతదేహాన్ని 3 కి.మీ మోసిన పోలీసులు
ఒక్క బైక్ మీద ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు.. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు…
అంతేనా….
మధ్యలో కూర్చున్న ఆమె, డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరి సహకరిస్తుంది.ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు….
కలికాలం పోలీసులు…. pic.twitter.com/PEGeuG58jV— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) April 10, 2021











