‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో పలు ఆఫర్స్ ఆటోమెటిగ్గా అందుకున్నాడు. అందులో ‘జాతిరత్నాలు’ సినిమా ఒకటి. నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో .. నవీన్ పోలిశెట్టి అనే కుర్రోడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో జాతిరత్నం గా వెలుగొందుతున్నాడు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 65 కోట్లు వసూళ్ళను తెచ్చిపెట్టిన ఈ సినిమా.. అమెరికాలో సైతం దాదాపు 1మిలియన్ డాలర్స్ కురిపించడంతో .. నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో ఖరీదైన జాతిరత్నమైపోయాడు. ఈ సినిమా భారీ సక్సెస్ తో నవీన్ తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. తదుపరి చిత్రాల కోసం అతడు ఏకంగా రూ. 5కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నాడట.
అనుష్క హీరోయిన్ గా , నవీన్ హీరోగా త్వరలో ప్రారంభం కానున్న సినిమా నుంచి నవీన్ ఆ పారితోషికాన్ని అందుకోబోతున్నాడట. దీనికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఖాయం చేయబోతున్నారట. ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ సక్సెస్ ను తనివితారా ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కి వెళ్ళిన నవీన్ పోలిశెట్టి.. అనుష్క సినిమా ఒకటి తప్ప.. మరో ప్రాజెక్ట్స్ ను ఓకే చేయలేదట. ఆఫ్టర్ టూర్ .. నవీన్ కొన్ని ఆసక్తికరమైన కథల్ని ఎంపిక చేయబోతున్నాడట.
Must Read ;- మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడి మూవీ











