కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటూ.. 25 శాతం డిస్కౌంట్. ఇదేదో బాగుందే.. అనుకుంటున్నారా! ఈ ఆఫర్ ఇక్కడ కాదండీ.. దుబాయ్ లో. అక్కడి ఓ రెస్టారెంట్ లో. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా మంది ముందుకురావడం లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ప్రచారం వల్ల చాలా మంది విముఖత చూపుతున్నారు. యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. తాజాగా దుబాయిలోని బాబ్ అల్ షామ్స్ అనే రిసార్ట్.. ఓ కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది.
వ్యాక్సిన్ వేయించుకో.. డిస్కౌంట్ అందుకో..
వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు తమ హోటల్లోని అన్ని బుకింగ్స్పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉంటుందని ప్రకటించింది. దుబాయి హెల్త్ అథారిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తోందని, వారికి సహాయంగా తాము ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. తమ ఆఫర్ ద్వారా కొంత మంది అయినా తమంతట తామే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటారన్న నమ్మకం తమకు ఉందని తెలిపింది.
Must Read ;- ప్రజలపై కరోనా సెస్సు .. ‘పన్ను’ పీకుతారట!