చిత్తూరు జిల్లా పరిధిలో మరో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, మార్జేపల్లెలో డిగ్రీ విద్యార్థి అదృశ్యం. దేవుడి దగ్గరకు వెళ్లిపోతానంటూ లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయిన గణేష్. చనిపోయి మళ్లీ తమ్ముడికి కొడుకుగా పుడతానంటూ లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయిన గణేష్ అనే డిగ్రీ విద్యార్థి.
మదనపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. తల్లిదండ్రులే.. కూతుళ్లను కొట్టి చంపిన ఘటన ఇంకా మరుపుకు రాక ముందే.. అలాంటి పిచ్చి తరహాలో మరో ఘటన జరిగింది. గంగవరం మండలం, మార్జేపల్లెలో స్థానికంగా డ్రిగ్రీ కళాశాలలో చదువుతున్న గణేష్ అనే విద్యార్థి హఠాత్తుగా ఇంటి నుండి మాయమయ్యాడు. అతను ఏమయ్యాడని ఇంట్లోని వాళ్లు ఆందోళన చెందుతున్న సమయంలో అతను రాసిన లెటర్ అందరినీ విస్తుపోయేలా చేసింది. తాను దేవుడని కలవడానికి వెళుతాననీ, తిరిగి పుడతాననీ, తమ్ముడికే కొడుకుగా జన్మిస్తానని.. లెటర్లో ఉండడం స్థానికంగా కలకలం రేపింది.
ఒక సంఘటన ప్రభావం అందరి పైనా పడకపోయినా.. దాని ప్రభావానికి గురై దాని గురించే ఆలోచించే వ్యక్తులు కొందరు ఉంటారు. గణేష్ కూడా అదే కోవ లోకి వస్తాడు. పదే పదే జరిగిన సంఘటన తలుచుకోవడం వల్లనో.. దాని గురించి విపరీతంగా ఆలోచించడం వల్లనో కొందరు దాని వైపు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం గణేష్ ఘటన కూడా అలాంటిదే అని చెప్పచ్చు.
Must Read ;- శివుడికే కరోనా పరీక్షలా!











