September 6, 2026 6:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఇందూరు పసుపు రైతుల నిరసన.. “ఢిల్లీ రైతు ఉద్యమం”గా మారబోతోందా?

ఇందూరులో పసుపు రైతులు రోడ్డెక్కారు. సర్కారు తీరును ఎండగడుతూ జాతీయ రహదారిని స్తంభింపజేశారు. ఢిల్లీలో రైతుల ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళతామని ప్రకటించారు. తెలంగాణ సైతం మరో ఢిల్లీ రైతు ఉద్యమ వేదికగా మారబోతోందా? అసలు పసుపు రైతుల నిరసనలకు.. ఢిల్లీ రైతు ఉద్యమానికి సంబంధం ఏంటి?

January 11, 2021 at 11:57 AM
in Editors Pick, General, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హస్తిన… రైతు నిరసనలతో హోరెత్తుతోంది. యావత్ దేశం కర్షకుని పక్షమైంది. అన్నదాతల ఆవేదనకు మద్దతు పెరుగుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఇది.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తెలంగాణలో పసుపు రైతులు రోడ్డెక్కడం చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ స్థాయిలోనే ఇందూరులో సైతం రైతు ఉద్యమం బలపడబోతోందా? అసలీ పసుపు రైతుల డిమాండ్లు ఏంటి? దశాబ్దాల నుంచి పసుపు రైతులపై సర్కారెందుకు ఇంత వివక్ష చూపుతోంది?

మూడు గంటల పాటు ఆందోళన

పసుపు రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలొచ్చిన రైతులు ఆర్మూర్‌ పట్టణం మామిడిపల్లి చౌరస్తా నుంచి 44వ జాతీయ రహదారి వరకు ఊరేగింపు నిర్వహించారు. కొందరు రైతులు పసుపు కొమ్ములు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రైతు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఉద్యమిస్తూ మృతి చెందిన రైతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఆ ఎంపీ రాజీనామాకు… ఎందుకంత డిమాండ్?

పసుపు రైతుల ఆందోళనకు ఎంపీ అర్వింద్‌కు ఉన్న సంబంధమేంటి? ఇప్పుడు ఎంతోమందిలో రగులుతున్న ప్రశ్న ఇదే! అయితే.. తాను ఎంపీగా గెలిస్తే.. పసుపు బోర్డు, మద్దతు ధర సాధిస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు అర్వింద్‌. అప్పట్లో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోలేదని, ఎంపీ పదవికి రాజీనామా చేసి, తమతో కలిసి ఉద్యమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రైతులు కోరారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాలుగు రోజుల పాటు రహదారి దిగ్బంధనం కొనసాగిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని పలువురు అన్నదాతలు అభిప్రాయ పడుతున్నారు.

ఏపీలాగా ధర నిర్ణయించాలి..

పసుపు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6850 ధర నిర్ణయించింది. ఆ రేటు పసుపుకు వచ్చే విధంగా చూస్తున్నారు. మార్కెట్‌లో క్వింటాలు 4వేల నుంచి 5500 రూపాయల మధ్య అమ్మకాలు జరిగినా తహసీల్దార్‌ సర్టిఫై ద్వారా మిగతా డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని రైతులు తెలిపారు. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం ధర నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తే వ్యాపారులు ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తారని అన్నదాతలు చెబుతున్నారు.

పసుపు రైతుపై కరోనా ప్రభావం..

దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిజామాబాద్‌ పసుపు సరఫరా అవుతోంది. చైనా, దుబాయి, మస్కట్‌, ఒమన్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోయాయి. భారీగా ఆర్డర్లు వచ్చే స్థాయి నుంచి అసలు ఆర్డర్లు వస్తాయా? రావా అనే పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్‌ నుంచి ప్రతి సంవత్సరం చైనాకే ఎక్కువగా ఎగుమతి చేస్తారు.

ఆ మాటలన్నీ నీటి మీద రాతలేనా?

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినా పసుపు మద్దతు ధరపై దృష్టి పెట్టడం లేదు. పసుపు బోర్డు, మద్దతు ధరపై ఏళ్ళ తరబడి హామీలు ఇచ్చినా ఫలితం మాత్రం లేదు. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. మద్దతు ధర ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా దాని ఫలితం సంవత్సరం తరువాతనే తేలనుంది.

ఈ-నామ్‌ ఉన్నా.. ప్రయోజనం సున్నా!

వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్‌ ఉన్నా ప్రయోజనం లేదు. జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఇక్కడి వ్యాపారుల వద్దనే గత సంవత్సరం స్టాక్‌ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం లేదు.

మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. ఎకరానికి రూ.లక్ష, గరిష్ఠగా రూ.1.25 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. రాష్ట్రంలో సగటున ఎకరానికి 20 క్వింటాళ్ల లెక్కన 20 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పసుపు క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే సెంటర్లు ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపితే ప్రైవేటు ట్రేడర్లు దారికొస్తారని, మార్కెట్లో ధర స్థిరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.  తమ తదుపరి కార్యాచరణను ఈనెల 20న ప్రకటిస్తామని రైతు సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. దశలవారీ ఉద్యమం చేపట్టి మద్ధతు ధర సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.

ఢిల్లీ రైతుల స్ఫూర్తితో రోడ్డెక్కడం గర్వకారణం : కె.నాగేశ్వర్‌, ప్రొఫెసర్

అంబానీ, అదానీలు వచ్చి క్వింటాలుకు రూ.15వేలు చొప్పున పసుపు పంటను కొనుగోలు చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంలో మద్దతు ధర అంశం లేకపోవడంతో కార్పొరేట్‌ శక్తుల ఆగడాలు పెచ్చుమీరుతాయి. రైతుకు, కంపెనీకి మధ్య పేచీ వస్తే కోర్టుకు పోవద్దని కేంద్ర వ్యవసాయ చట్టాల్లో నిబంధన పెట్టడం ఏంటి?. కోర్టుకు పోవద్దని చట్టాలు తేవడం హేయమైన చర్య. నూతన సాగు చట్టాలతో ఎవరైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎంతైనా.. ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం కల్పించామనడం శుద్ధ అబద్ధం. రైతుల నుంచి తక్కువ ధరకు పంటలు కొని, ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకునేందుకు కార్పొరేట్‌ సంస్థల లాభం కోసం చట్టాలను తెచ్చారు. ఢిల్లీలో రైతుల స్ఫూర్తితో ఇందూరు పసుపు రైతులు రోడ్డెక్కడం గర్వంగా ఉంది.

Tags: Arvind Dharmapuridaily updatesfarmer newstelangana newsTelangana Politicstelugu newstelugu news updatesturmeric farmers agitation in nizambad district
Previous Post

స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?

Next Post

అఖిలప్రియకు బెయిల్ నిరాకరణ.. 3 రోజుల పోలీసు కస్టడీ

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist