కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం దారుణం!
ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి .. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించి సభ నుంచి వెనుదిరిగారు. అవమానాలు, దిగజారుడు మాటలు భరించలే సెలవు తీసుకుంటున్నాను …! అంటూ శాసన సభ నుంచి చంద్రబాబు అవేదనతో వెనుదిరిగారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతా! అని శపథం చేశారు. సభలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాడే పరుష పదజాలం, దిగజారుడు మాటలు కలతకు గురిచేస్తున్నాయి. టీడీపీతోపాటు పార్టీ అధినేత చంద్రబాబుపై అధికార పక్షం దూషణల పర్వానికి తెరతీసి ఎదురు దాడికి దిగింది. మంత్రి కొడాలి, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు చంద్రబాబు నాయుడు వయస్సు కు కూడా గౌరవంగా ఇవ్వకుండా ‘లుచ్చా’ అని నోటికి వచ్చినట్లు తిట్టడం .. మంత్రి కన్నాబాబు, ఎమ్మెల్యేలు తనదైన శైలిలో బూతులు దండకాన్ని అందుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురౌన చంద్రబాబు .. సంచలన ప్రకటన చేశారు. ఈ అవమానాలను ఇక భరించడం కన్నా సభ నుంచి వెనుదిగడం, మళ్ళీ గౌరవంగా ఉండేందుకు తాను సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ అయ్యారు.
నా భార్య గురించి సభలో ప్రస్తావించడం సబబా? – చంద్రబాబు
కుటుంబంలోని మహిళాలను సైతం రాజకీయాల్లోకి లాగుతారా అంటూ చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరుపెట్టుకున్నారు. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు తన భార్యను, కుటుంబ సభ్యుల్లోని మహిళాలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారు. విలువతో కూడిన రాజకీయాల్లో కుటుంబంలోని మహిళపై దూషణలు తగవని చంద్రబాబు వారిస్తున్నా .. స్పీకర్ తన మైక్ ను కట్ చేసిన అవమానించారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. ఎన్నోళ్లుగా రాజకీయాల్లో ఉన్నా .. ఇంతటి అవమానాలను ఎప్పుడు ఎదుర్కొలేదన్నారు చంద్రబాబు. ఇన్ని సంవత్సరాలు ఏ పరువు కోసం పని చేశానో .. ఇన్నేళ్లుగా ఎందుకు బ్రతికానో దానిని రోడ్డుకు ఈడుస్తారా? అంటూ అవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబం, నా భార్య విషయాన్ని కూడా తీసుకొచ్చి సభలో అవమానిస్తారా? అని చంద్రబాబు ఆక్రోసించారు. ఇక హుందాగా లేని సభలో నడుచుకోవడం సరికాదని వాకౌట్ చేస్తున్నాం అంటూ సభ నుంచి బయటకు వచ్చారు.