విక్టరీ వెంకటేశ్ తో ‘గురు’, సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి ప్రయోజనాత్మక చిత్రాలు రూపొందించిన దర్శకురాలు సుధా కొంగర. ఈ రెండు సినిమాల్నీ మంచి కాన్ఫ్లిక్ట్ తో చక్కటి ఎమోషన్స్ తో తెరకెక్కించింది. అందుకే ఆమె టాలెంట్ మీద ప్రేక్షకులకి మంచి నమ్మకం ఉంది. అలాంటి ఈ దర్శకురాలు త్వరలో డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ప్రభాస్ కి కథ కూడా వినిపించిందట. పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమని ప్రభాస్ చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వస్తుందట. కొంతకాలంగా మహేశ్ తో కూడా సుధా కొంగర ఒక సినిమా తీయబోతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. అలాగే.. విజయ్ దేవరకొండతో కూడా సుధ సినిమా తీస్తుందని కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇక లిస్ట్ లోకి ఇప్పుడు ప్రభాస్ కూడా యాడ్ అయ్యాడు.
ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే భారీగా ఉంది. రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ సలార్, ఓం రౌత్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ మూవీ.. ఇలా వరుసగా పాన్ ఇండియా మూవీసే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుధా కొంగర సినిమాని కూడా ప్రభాస్ ఓకే చేస్తే.. ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేటప్పటికే మూడేళ్ళు పట్టేలా కనిపిస్తోంది. పైగా.. సుధా కొంగర పాన్ ఇండియా లెవెవ్ దర్శకురాలు కాదు. ఈ నేపథ్యంలో ఈ కాంబో లో సినిమా ఉంటుందో లేదో కూడా డౌటే అంటున్నారు సినీ వర్గాల వారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.