Chiranjeevi Request To AP Government Over On Ticket Rates
ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లుపై సినిమా పరిశ్రమ పరంగా ఇంతవరకు ఎవరూ గళం విప్పలేదుగానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలన్ని పంచుకున్నారు. పారదర్శకత కోసం ఆన్ లైన్ టిక్కెట్ వ్యవస్థను ప్రవేశం పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే టిక్కెట్ ధరల విషయంలో మాత్రం పునరాలోచించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఒకటే రకమైన జీఎస్టీ ఉన్నప్పుడు టిక్కెట్ ధరలు కూడా ఒకే రకంగా ఉంటే బాగుంటుందని అన్నారు.
తగ్గించిన రేట్లను మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. టిక్కెట్ ధరల విషయంలో మాత్రం వెసులు బాటు ఉండాలన్నారు. సినీ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ఇలాంటి ఊతం ఉండాలన్నారు. సినీ పరిశ్రమపైనా, థియేటర్లపైనా ఆధారపడ్డ కుటుంబాల కోసం ప్రభుత్ం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్మోహనరెడ్డిని కోరారు. ఇంతకుముందు సంతోషం అవార్డుల వేడుకలోనూ ఆయన ఈ విషయంపై మాట్లాడారు.
Chiranjeevi Request To AP Government Over On Ticket Rates
తమ అభిప్రాయాలను చెప్పడానికి సీఎం ను కలుసుకోవాలని అనుమతి కోరినా ఇంతవరకు రాలేదని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో బి, సి సెంటర్లలో 15, 20 రూపాయలే టిక్కెట్ ధరలు ఉన్నాయి. ఇలా కాకుండా ఒకేరకమైన టిక్కెట్ ఉండాలని వీరు కోరుతున్నారు. ఈ విషయంలో ఛాంబర్ పరంగా కూడా డిమాండు ఉంది. ప్రభుత్వ పెద్దలు వీటిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.
Must Read ;- నాలుగు ఆటలతో ఆ నలుగురి ‘ఆట’ కట్టు