గత కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.ఇక ఇటీవల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని పేర్కొనడంతో ఇక ముందస్తు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చారు.
తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ముందస్తుకు వెళ్ళిన బిజెపికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు.దీంతో ముందస్తు ఆశలపై కేటీఆర్ నీళ్లు చల్లారనే చర్చ జోరందుకుంది.అదేసమయంలో పార్టీ చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని కేటీఆర్ వెల్లడించారు.
తమకున్న సమాచారంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 90 సీట్లు గెలుస్తుందని.. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తధ్యమని కేటీఆర్ అన్నారు. తమ పార్టీలో ఉన్న విబేధాలే తమకున్న బాలామణి.. తాము పార్టీలో చేరే విషయంలో ఏవైరపైనా బాల ప్రయోగం చేయలేదని తెలిపారు. దక్షిణాదిలో వరుసగా మూడోసారి సిఎం అయిన నేత ఎవరూ లేరన్న కేటీఆర్.. రాబోయే ఎన్నికల్లో బలాలు, బలహీనతలు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం అభివృద్ధిలో తెలంగాణ ఉందని పేర్కొన్న కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధిలో మాత్రం కేంద్రం పాత్ర లేదని అన్నారు.తాను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ! తెలంగాణ గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్ తెలిపారు.అదేసమయంలో రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే స్వాగతిస్తామన్న ఆయన.. కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో రాహుల్ చూడాలని కోరారు. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్లలో ఉండాలని కోరుతున్నానని.. కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలని హితువు పలికారు.ఇక రాహుల్కి అమేథి, రేవంత్కి కొడంగల్లో చెల్లని నాణేలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.