ఐపీఎల్ టోర్నీలో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు నేడు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చివరి స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన రన్రేట్ కారణంగా పంజాబ్ జట్టు ఏడో స్థానంలోనూ, చెన్నై టీమ్ చెన్నై ఎనిమిదో ప్లేస్లోనూ ఉన్నాయి. ఈ సీజన్ను విజయంతో ప్రారంభించిన చెన్నై టీమ్ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇక, తొలి మ్యాచ్లో పరాజయం పాలైన పంజాబ్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ రెండు టీమ్ల మధ్య ఆదివారం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. మరి, ఎవరి తలరాత మారుతుందో చూడాలి.
చెన్నై టీమ్ బలాలు
చెన్నై టీమ్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, బ్రావో వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు ఎంత త్వరగా ఫామ్లోకి వస్తే చెన్నై టీమ్కు అంత మంచిది. బౌలింగ్ విభాగంలో కూడా అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వీరు టచ్లోకి రావడమే తరువాయి. గత సీజన్లో కూడా ఆరంభంలో తడబడిన చెన్నై తర్వాత పుంజుకుని ఫైనల్స్కు చేరింది. ఈసారీ అదే రిపీట్ అవుతుందని చెన్నై టీమ్ ఆశగా ఉంది.
బలహీనతలు
వరుస పరాజయాలతో చెన్నై టీమ్ నిరుత్సాహంలో ఉంది. తమ టీమ్లో ప్రొఫెషనలిజమ్ లోపించిందని ధోనీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నై టీమ్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లున్నప్పటికీ వారిలో చాలా మంది రిటైర్ అయ్యారు. దీంతో వారు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. అందరూ సీనియర్లు కావడంతో యంగ్ బ్లడ్ లేక చెన్నై ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే చెన్నై టీమ్ ఫీల్డింగ్ విభాగం అత్యంత బలహీనంగా ఉంది. ఫామ్లో ఉన్న రాయుడు వంటి కొద్ది మంది ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
చెన్నై టీమ్ (అంచనా)
డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, కర్రన్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో
పంజాబ్ కింగ్స్ లెవన్ బలాలు
ఈ సీజన్లో పంజాబ్ కూడా చెన్నై తరహాలోనే ఆపసోపాలు పడుతోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మ్యాక్స్వెల్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. బ్యాటింగ్ విభాగం మిగతా జట్లతో సమానంగానే ఉంది. అయితే సమష్టిగా రాణించడమే కావాల్సింది. ఈ సీజన్లో పుంజుకునే అవకాశాలు పంజాబ్ టీమ్కు పుష్కలంగా ఉన్నాయి.
బలహీనతలు
ఈ సీజన్లో పంజాబ్ టీమ్కు అదృష్టం కలిసి రావడం లేదని చెప్పాలి. తొలి మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో 223 పరుగుల భారీ స్కోరు చేసినా రాజస్థాన్ ఛేజింగ్ చేసేసింది. బ్యాటింగ్తో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా ఉంది. వికెట్లు తీయకపోగా అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలింగ్ గాడిన పడితే పంజాబ్ టీమ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశముంది.
పంజాబ్ టీమ్ (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్, కరుణ్ నాయర్, పూరన్, మ్యాక్స్వెల్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, కాట్రెల్.
మ్యాచ్ ఫేవరెట్
ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే చెన్నై కంటే పంజాబ్ టీమ్ బలంగా ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగల్లో బలంగా కనబడుతోంది. మరోవైపు స్ఫూర్తివంతమైన ధోనీ నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. చెన్నై టీమ్ పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.











