ఏపీలో పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, వేలాది మంది చనిపోతున్నారని, విద్యార్ధులు,వారి తల్లిదండ్రుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఆయన కన్వెన్షన్ సెంటర్లో నిరసన దీక్షకు దిగారు. పరీక్షలు రద్దు చేసే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
కరోనా వేగంగా విజృంభిస్తోన్న వేళ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి 35 లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పాల్ హితవు పలికారు.పరీక్షలు రద్దు చేసి పాస్ చేయమని తాను కోరడం లేదని, కనీసం రెండు నెలలపాటు పరీక్షలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.తన దీక్ష వద్దకు ఎవరూ రావద్దని సూచించారు. పరీక్షల రద్దు కోరుతూ తాను వేసిన పిటీషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని పాల్ గుర్తు చేశారు.
Must Read ;- పది,ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి.. హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్











