హైదరాబాద్ కూకట్ పల్లి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే సమాచారం అందుకున్న సీపీ సజ్జనార్ వెంటనే రంగంలోకి దిగారు. పారిపోయిన దుండగులను వెతికి పట్టుకునేందుకు ఆయన ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి 6 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఘటన స్థలంలో ఒక గన్ కాట్రిడ్జ్తో పాటు హెల్మెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపనేనని అన్నారు. దుండుగలను రూ.5 లక్షలు దోచుకెళ్లినట్లు, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
Must Read ;- కూకట్ పల్లిలో కాల్పుల కలకలం : భారీ దోపిడీ, సెక్యూరిటీ గార్డు మృతి