ఏపీలో పది,ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం వల్ల వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని కేఏపాల్ తరఫు న్యాయవాదులు పిటిషనల్లో పేర్కొన్నారు. కేఏపాల్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకావం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా?
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కరోనాతో పాటు,పరీక్షల నిర్వహణలపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఉపసంఘం దీనిపై ముఖ్యమంత్రికి సూచనలు చేయనుంది. పరీక్షల రద్దుకు మంత్రివర్గ ఉపసంఘం సూచిస్తుందా లేదా అనేది సాయంత్రానికి తేలనుంది.
Must Read ;- ఒక తండ్రిగా ఆలోచించి చెబుతున్నా, పరీక్షలు రద్దు చేయండి : నారా లోకేశ్











