అసెంబ్లీ లాబీల్లో నుంచే మంత్రి కొడాలి నాని, ప్రతిపక్ష నేతపై మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు, లోకేశ్లకు ఐదు రోజుల అసెంబ్లీ సరిపోకపోతే జూమ్, ట్విట్టర్లో సమావేశాలు పెట్టుకోవచ్చని కొడాలి సెటైర్లు వేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో, మంత్రి పేర్నినాని తాపీతో కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. అలిపిరిలో చంద్రబాబు కూడా కావాలనే దాడి చేయించుకున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. మాకు మా భద్రత కన్నా.. ప్రజల భద్రతే ముఖ్యం, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ లో సవాల్ విసిరారు.